MLC : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ కోట ఎమ్మెల్సీలను నియమించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన తెలంగాణ జనసమితి పార్టీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మరియు అమరుల్లా ఖాన్ లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
గత ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ మరియు సత్యనారాయణ పేర్లను గవర్నర్ కి పంపించడం జరిగింది. అయితే వారికి అర్హత లేదు అంటూ గవర్నర్ తమిళి సై తిరష్కరించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిఫార్స్ మేరకు కోదండరాం మరియు అమరుల్లా ఖాన్ లను నియమించారు.
సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీ ఖాన్ కుమారుడు అమరుల్లా ఖాన్ ను గవర్నర్ నియమిస్తూ ఉతర్వులు జారీ చేశారు. ఈ విషయమై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాసోజు శ్రవణ్ మరియు సత్యనారాయణ ల విషయంలో ఎందుకు వివక్ష అంటూ ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.