సౌత్లో సంగీత దర్శకుల్లో అత్యధిక పారితోషికం తీసుకున్న వారు ఎవరు అంటే ఠక్కున ఏఆర్ రహమాన్ అంటారు. ఆయన తర్వాత స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ ఉండవచ్చు. ఈమద్య కాలంలో థమన్ జోరు కొనసాగుతుంది. అయితే ఎవరైనా కూడా అయిదు మూడు నుండి అయిదు కోట్ల పారితోషికం తీసుకుంటారు. రహమాన్ అయితే పది కోట్ల వరకు కూడా తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాని మన కీరవాణి మాత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఏకంగా 16 కోట్లను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయిన కీరవాణి బాహుబలి సినిమాకు తన బాణీలతో ఎంతటి బలాన్ని ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి బ్లాక్ బస్టర్ అవ్వడంలో సంగీతం పాత్ర కూడా చాలా కీలక పాత్రను పోషించింది. అందుకే ఆర్ఆర్ఆర్ చిత్రంకు కూడా ఆయనతోనే జక్కన్న పాటలు చేయిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను కీరవాణి సంగీతాన్ని అందించినందుకు ఆయన తీసుకుంటున్న పారితోషికం 16 కోట్లు అంటూ వార్తలు వస్తున్నాయి.
మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ వార్తలు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్కు కూడా ఆశ్చర్యంను కలిగిస్తుండట. ఒక సంగీత దర్శకుడికే అంత పారితోషికం అయితే దర్శకుడు హీరోలు.. హీరోయిన్లకు పారితోషికం ఎంత ఉండాలని అంటున్నారు.
కీరవాణి పారితోషికం విషయంలో వస్తున్న వార్తలు నిజం కాకపోవచ్చు అంటూ కొందరు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కీరవాణి స్పందిస్తే కాని అసలు విషయం తెలియదు.
327423 527885But wanna say that this is invaluable , Thanks for taking your time to write this. 62145
66709 57040I believe other internet site owners should take this website as an model, very clean and superb user genial style and style . 154458