తమిళనాడులో రాజకీయ వేడి కొనసాగుతోంది. పార్టీలన్నీ పోటాపోటీ ప్రచారాలతో దూసుకెళ్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎమ్) పార్టీ అధినేత కమల్ హాసన్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తాను పోటీ చేస్తున్న కోయంబత్తూరు నియోజకవర్గంలోనే మేనిఫెస్టో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తామ అధికారంలోకి వస్తే యువతకు 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. యువ ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచుతామన్నారు. రాష్ట్రంలోని అన్ని సిటీల్లో మోనో రైళ్లను ప్రవేశపెడతామన్నారు. ఈమేరకు పలు వాగ్దానాలతో మేనిఫెస్టోను విడుదల చేశారు.
103121 201785Thank you a lot for giving everybody an extraordinarily unique possiblity to check ideas from here. 742660
564530 435790Thank you for having the time to discuss this topic. I truly appreciate it. Ill stick a link of this entry in my site. 258905
805013 246159you could have a amazing weblog here! would you wish to make some invite posts on my weblog? 817962