తమిళనాడు లో మళ్లీ శాసనమండలి ఏర్పాటు చేయడానికి పావులు కదులుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే తిరిగి శాసనమండలిని పునరుద్దరిస్తామని మిత్రపక్షాలకు డీఎంకే హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని డీపీఐ నేత తిరుమావళవన్ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 180 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మిత్రపక్షాలకు తగిన సీట్లు కేటాయించలేకపోయింది. ఈ క్రమంలో తక్కువ సీట్లతో అసంతృప్తి వ్యక్తంచేస్తున్న పార్టీలను బుజ్జగించడానికి డీఎంకే అధినేత స్టాలిన్.. మండలి పునరుద్ధరణ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచే అవకాశం ఉంది. మండలి పునరుద్ధరణ తర్వాత మిత్రపక్షాలకే భారీగా ఎమ్మెల్సీ స్థానాలు కట్టబెడతానని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. మాజీ సీఎం ఎంజీఆర్ హయాంలో శాసనమండలి రద్దు చేశారు. అప్పటి నుంచి డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా మండలి పునరుద్ధరణకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించేది. అనంతరం అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చి, ఆ ప్రతిపాదనలను రద్దు చేసేది. ఇలా మండలి పునరుద్ధరణ నిలిచిపోయింది. తాజాగా డీఎంకే దాని పునరుద్ధరణకు చొరవ తీసుకుంటోంది.
463228 362489Oh my goodness! a great post dude. Several thanks Even so We are experiencing dilemma with ur rss . Dont know why Can not sign up to it. Could there be anybody locating identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 490093
159033 344825Sweet internet web site , super design , genuinely clean and utilize genial . 609514
689408 645301Cheers for this exceptional. I was wondering whether you were planning of publishing comparable posts to this. .Keep up the superb articles! 174833
212753 587387I like this website so considerably, saved to favorites . 413868