మొత్తానికి నందమూరి కళ్యాణ్ రామ్ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే తుగ్లక్ అంటూ ఓ సినిమా మొదలు పెట్టిన అయన మరో ఇద్దరు దర్శకులను లైన్ లో పెట్టేసాడు. వారితో పాటు తాజాగా మరో దర్శకుడితో చర్చలు జరుపుకున్నాడు కళ్యాణ్ రామ్. ఆ దర్శకుడు ఎవరో కాదు రామ్ చరణ్ తో రచ్చ చేసి .. రవితేజ ను బెంగాల్ టైగర్ గా చూపించిన సంపత్ నంది. బెంగాల్ టైగర్ సక్సెస్ తరువాత ఈ దర్శకుడు గోపీచంద్ తో ఓ సినిమా ప్లాన్ చేసాడు కానీ అందుకో వర్కవుట్ కాలేదు. దాంతో మరో ప్రయత్నంగా కళ్యాణ్ రామ్ తో చర్చలు జరుపుతున్నాడు.
నిజానికి సంపత్ నంది పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ చేయాలి .. కానీ ఆ సినిమాకు చాలా టైం పట్టడంతో ఆ సినిమా నుండి తప్పుకుని రవితేజ తో బెంగాల్ టైగర్ సినిమా చేసాడు సంపత్. ఆ తరువాత గోపి చంద్ సినిమా క్యాన్సిల్ కావడంతో ఈ దర్శకుడికి బ్రేక్ వచ్చింది. ఇప్పటికే కళ్యాణ్ రామ్ కు కథ చెప్పి ఓకే అనిపించుకున్నాడట. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి తీసుకొస్తానని చెప్పాడట. రామ్ చరణ్ కు రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సంపత్ నంది .. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో కూడా రచ్చ చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
మరి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే మరో రెండు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన కళ్యాణ్ రామ్ అవి పూర్తయ్యాకే సంపత్ సినిమాను పట్టాలు ఎక్కిస్తాడని అంటున్నారు. మొత్తానికి నందమూరి హీరోతో హిట్ కొట్టేసాడంటే సంపత్ నంది నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు ఛాన్స్ పట్టేసినట్టే.
543019 699389Rattling clean internet site , thanks for this post. 288421
978918 501127As I internet site possessor I feel the articles here is extremely amazing, regards for your efforts. 550367