Switch to English

ఖైదీ నెంబర్‌ 6093: ఓ న్యాయమూర్తి ఆవేదన ఇది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెరపైకి మళ్ళీ ‘ఖైదీ నెంబర్‌ 6093’ ప్రస్తావన వచ్చింది. అదీ, ఓ ప్రముఖ న్యాయమూర్తి తన తీర్పు సందర్భంగా ఆ ‘ప్రస్తావన’ చేశారు. ఆ ‘ఖైదీ నెంబర్‌ 6093’ ఇంకోవరో కాదు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్‌ కొన్నాళ్ళ క్రితం అరెస్టయి, జైల్లో వున్నప్పుడు ఆయనకు జైలు అధికారులు కేటాయించిన నెంబర్‌ 6093. ఖైదీ నెంబర్‌ 6093 అని గూగుల్‌ సెర్చ్‌లో టైప్‌ చేస్తే, చాలా సమాచారం లభిస్తుందని ఎవరో చెబితే, తాను అలా చేశాననీ, తద్వారా తాను తెలుసుకున్న సమాచారంతోపాటు, కొంత సాధికార సమాచారాన్ని సేకరించానని సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.

చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాకి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరికొందరు న్యాయమూర్తులపై వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఫిర్యాదు తర్వాత చాలా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయనీ, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఆయాచిత లబ్ది ఆ కారణంగా జరిగిందనీ న్యాయమూర్తి రాకేష్‌కుమార్‌ వ్యాఖ్యానించడం అటు న్యాయ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెను ప్రకంపనలు రేగుతున్నాయి.

రాజకీయాల్లో వున్న నేర చరితుల విషయమై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, రాష్ట్రంలోని పోలీసు శాఖ.. ముఖ్యమంత్రిపై అప్పటికే వున్న చాలా కేసుల్ని పలు కారణాలు చూపి మూసేశారంటూ న్యాయమూర్తి రాకేష్‌ కుమార్‌ వ్యాఖ్యానించడం మరో ఆసక్తికరమైన విషయం.

జగన్‌పై 2011 నుంచీ పెండింగ్‌లో వున్న చాలా కేసుల్లో ఇప్పటివరకు అభియోగాలు నమోదు కాకపోవడం వ్యవస్థపై గొడ్డలి పెట్టు.. అని రాకేష్‌ కుమార్‌ ప్రస్తావించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

పదవీ విరమణకు ముందు తనను తీవ్రంగా అవమానపరిచేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వ్యవహరించిందని రాకేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి సంబంధించిన కేసులో తుది విచారణ ప్రారంభం కాకుండానే ప్రభుత్వం తరఫున పిటిషన్‌ దాఖలవడం, డివిజన్‌ బెంచ్‌ సభ్యుడిగా వున్న న్యాయమూర్తిపై ఐఏఎస్‌ అదికారి క్రూరమైన ఆరోపణలు చేయడం.. ఇవన్నీ ఓ పథకం ప్రకారం జరిగినవేనన్నది న్యాయమూర్తి రాకేష్‌కుమార్‌ తీర్పులోని కొన్ని కీలకమైన అంశాలు.

ఇదే రాకేష్‌కుమార్‌, విచారణ బెంచ్‌ నుంచి తప్పుకోవాల్సిందిగా ప్రభుత్వం తరఫున న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైన విషయం విదితమే. న్యాయస్థానాలపై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన ఓ ఎంపీపై సాక్షాత్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఫిర్యాదు చేసినా కేసులు పెట్టలేని ప్రభుత్వ అసమర్థతనీ జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ఎండగట్టారు.

అయితే, న్యాయమూర్తులపైనా, న్యాయ వ్యవస్థపైనా ఇప్పటికే అవాకులు చెవాకులు పేలుతోన్న అధికార పార్టీకి, ఈ అక్షింతలు అంతగా ఇబ్బంది కలిగించేవి కావు. పైగా, ‘మేం చెప్పాం కదా, మాకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తోందని.. దానికి రాకేష్‌కుమార్‌ వ్యాఖ్యలే నిదర్శనం..’ అని అధికార పార్టీ వక్రభాష్యం చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...