తాడిపత్రి లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణ జేసీ ఇంటి వద్దే జరిగింది. జేసీ ఇంటిపై కూడా వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ సమయంలో జేసీ ఇంట్లో ఎవరూ లేరు. సామాజిక మాధ్యమాల్లో తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ ఇంటికి వెళ్లి ఆయన ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో వారికి అడ్డొచ్చిన కిరణ్ అనే వ్యక్తిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని బెదిరించారు. దీంతో ఇరు వర్గాలు భారీగా రాళ్లు రువ్వుకున్నారు. జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు కూడా ప్రతి దాడి చేశారు. ఈ దాడిలో ఇరు వర్గీయుల కార్లు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. దాడి విషయం తెలుసుకున్న జేసీ హైదరాబాద్ నుంచి తాడిపత్రి బయలుదేరారు.
642912 65561I as well conceive so , perfectly indited post! . 187693