Switch to English

బీజేపీతో జగన్‌కి ముప్పు ముంచుకొస్తోంది!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తమిళనాడులో రాజకీయాల్ని అత్యంత ఛండాలంగా మార్చేసిన కమల దళం, కర్నాటక రాజకీయాల్లో అలజడి సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనూ వేలు పెట్టేసి, తెలంగాణ రాజకీయాల్లో హల్‌చల్‌ చేద్దామనుకుంటోంది. కేంద్రంలో అధికారం తమది గనుక, ఎక్కడ ఏం చేసినా చెల్లిపోతుందనే ధోరణిలో వున్న బీజేపీ నేతలు, నైతిక విలువల్ని పూర్తిగా తుంగలో తొక్కేసి, అత్యంత భయంకరమైన రాజకీయాలు నడుపుతున్నారు.

చంద్రబాబు విదేశాలకు వెళ్ళగానే, టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల్ని లాగేసి, రాత్రికి రాత్రి ఆ నలుగురు సభ్యుల గ్రూపుని బీజేపీలో అడ్డగోలుగా కలిపేసుకునే ప్రక్రియను పూర్తి చేసేసింది. ఇప్పుడు అదే స్కెచ్‌ని కర్నాటకలో చూచాయిగా అమలు చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేయడంతో కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం సంకటంలో పడింది.

బొటాబొటి మెజార్టీతో కుమారస్వామి మెజార్టీ ఇప్పటికే దినదిన గండం.. అన్నట్టు బతుకుతోన్న విషయం విదితమే. జేడీఎస్‌ – కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోనే దెబ్బ కొట్టించాలన్నది బీజేపీ వ్యూహం. గతంలోనే ఒక్కో ఎమ్మెల్యేలకి పది కోట్ల చొప్పున బేరం పెట్టిన బీజేపీ, అప్పట్లో చావు దెబ్బ తినేసింది. లేకపోతే, కర్నాటకలో బీజేపీ ప్రభుత్వమే వుండేదిప్పుడు. కర్నాటక సంగతి సరే, ఆంధ్రప్రదేశ్‌ మాటేమిటి.? 151 మంది ఎమ్మెల్యేలున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి ఐదేళ్ళూ బీజేపీతో సమస్యలేమీ రావా.? అంటే, రావని మాత్రం చెప్పలేం.

ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ – వైసీపీ తెరవెనుకాల కలిసి పనిచేసినా, ఆ బంధం తెగిపోయే రోజు దగ్గర్లోనే వున్నట్లు కనిపిస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇద్దరు ఎంపీలు, అరడజను మంది ఎమ్మెల్యేలకు బీజేపీ ఇప్పటికే గాలం వేసిందనీ.. అయితే, రాష్ట్రంలో పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఆ నేతలెవరూ బీజేపీ వైపు వెళ్ళేందుకు ప్రస్తుతానికి సానుకూలంగా లేరనీ తెలుస్తోంది.

టీడీపీ నుంచి గనుక ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళితే, ఆటోమేటిక్‌గా వైసీపీ నుంచి కూడా వలసలు వుంటాయని బీజేపీ నేతలు చాలా ధీమాగా చెబుతున్నారు. ‘మూడేళ్ళలో రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయ్‌..’ అని బీజేపీ నేతలు చెబుతుండడం వెనుక పెద్ద స్కెచ్చే వుందట. ప్రత్యేక హోదా విషయంలో ఆల్రెడీ జగన్‌ సర్కార్‌పై మండిపడ్తున్న బీజేపీ, ముందు ముందు బలమైన ప్రతిపక్షంగా మారి.. జగన్‌ ప్రభుత్వానికి ముప్పు తెచ్చే అవకాశాల్లేకపోలేదని రాజకీయ విశ్లేషకులూ అంచనా వేస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...