Switch to English

జగన్ సీన్ రివర్స్: పోలవరంపై ముందుకా.. వెనక్కా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ కు కీలకమైన పోలవరం ప్రాజెక్టులో ఎలా ముందుకెళ్లాలో తెలియక ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందా? రివర్స్ టెండరింగ్ పేరుతో నవయుగ ఒప్పందాన్ని రద్దు చేసిన సర్కారు.. అయోమయంలో పడిందా? అంటే ఔననే అంటున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ నుంచి ఎలాంటి మద్దతూ లభించకపోవడంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్టు చెబుతున్నారు.

అందువల్లే ఇటీవల కాలంలో పోలవరం ప్రాజెక్టుపై అటు ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ సహా ఎవరూ నోరు మెదపకుండా సైలెంట్ అయ్యారని పేర్కొంటున్నారు. రీటెండరింగ్ కు వెళ్లి చాలా రోజులు అయినా.. దాని ప్రస్తుత స్థితిగతులు ఏమిటనే అంశాన్ని సర్కారు వర్గాలు చెప్పడంలేదు. రేమండ్ పీటర్ ఇచ్చిన నివేదికపై కేంద్ర ప్రభుత్వం పలు సందేహాలు లేవనెత్తడమే ఇందుకు కారణమని సమాచారం. పీటర్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం నవయుగ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని జగన్ సర్కారు రద్దు చేసి, రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది.

Also Read: కొత్త కథ: కత్తీ ఎందుకు గుచ్చుకున్నావ్‌.!

అయితే, ఈ విషయంలో హైకోర్టులోనూ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ, జగన్ వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్లాలని భావించారు. దీనిపై ఇటీవల కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వివరణ ఇచ్చారు. అయినప్పటికీ వారు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. పైగా పీటర్ ఇచ్చిన నివేదికలో కొన్ని అంశాలపై వివరణ కోరుతూ కేంద్రం లేఖ రాసింది. కానీ ఇప్పటివరకు వాటికి ఏపీ ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మిన్నకుండిపోయింది.

ఇప్పటికే ఈ వ్యవహారం చాలా దూరం వచ్చేసిందని.. పోలవరం రివర్స్ టెండరింగ్ పై జగన్ అటు ముందుకు, ఇటు వెనక్కి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ జగన్ ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తే.. ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు కేంద్ర నిధులతో 71 శాతం పనులు పూర్తికాగా, మిగిలిన 29 శాతం పనులను రాష్ట్రమే సొంత నిధులతో పూర్తి చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. అయినప్పటికీ ఇది కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టు కావడంతో కేంద్రం అభ్యంతరం వ్యక్తంచేసే అవకాశం ఉందని స్పష్టంచేస్తున్నారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేసి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. దీనిపై తమ పార్టీ పెద్దలకు నివేదిక సైతం సమర్పించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రివర్స్ టెండర్లపై కేంద్రం అభ్యంతరం వ్యక్తంచేస్తోందని తెలుస్తోంది. మొత్తానికి పోలవరం విషయంలో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...