ఓ వైపు ఆర్థిక మాంద్యం.. మరోవైపు కేంద్రం నుంచి లేని సహకారం.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏపీలోని జగన్ సర్కారు ఎడాపెడా సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చిస్తోంది. ఇందుకోసం వడ్డీలకు అప్పలు తెస్తోంది. చంద్రబాబు తన హయాంలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసి ఏపీని దివాళా తీయించారని ఆరోపణలు చేసిన వైసీపీ కూడా ఇప్పుడు అప్పుల కోసం ఎగబడుతోంది. అప్పు చేయకుంటే నెలవారీ ఖర్చులు కూడా జరగని పరిస్థితిలో ఏపీ ఖజానా ఉంది.
ఇటీవల అమలు చేసిన అమ్మఒడి పథకం కోసం 11 శాతం వడ్డీకి రుణాలు సేకరించింది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణే నిధుల కోసం అటు కేంద్ర ప్రభుత్వానికి విన్నపాలు చేయడంతోపాటు ఉన్న నిధులను ఆచితూచి ఖర్చు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అసలే లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ కావడంతో ఖజానా బ్యాలెన్స్ కావడంలేదు.
దీంతో సీఎం జగన్ కు తత్వం బోధపడింది. వెంటనే సైలెంటుగా బాదుడు షూరూ అయింది. ఆయన గద్దెనెక్కిన తర్వాత ఆర్టీసీ చార్జీలను స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పెట్రోలు, డీజిల్ పై వడ్డించేశారు. ఇప్పటివరకు పెట్రోల్ పై 31 శాతం వ్యాట్, లీటరుకు రూ.2 రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసేది. దానిని 35.2 శాతానికి పెంచారు. అలాగే డీజిల్ పై 22.5 శాతం ఉన్న పన్నును 27 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఆ మేరకు వాహనదారులపై భారం తప్పదు.
ఎన్నికల సమయంలో జగన్ ప్రకటించి సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే రాబోయే కాలంలో ఇలాంటి మరిన్ని వడ్డనలు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మద్యం రేట్లను విపరీతంగా పెంచిన సర్కారు.. ఇంకా వేటిని పెంచుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
569804 656484Very nice post. I just stumbled upon your blog and wanted to say that Ive truly enjoyed surfing about your blog posts. Following all I is going to be subscribing to your feed and I hope you write again extremely soon! 212743