Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: అమరావతి అగ్రిమెంట్లలో ‘పవర్’ ఎంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

రాజధాని అమరావతి కోసం రైతులు భూములిచ్చారు. స్వచ్ఛందంగా ఇచ్చారా.? బాలవంతంగా లాక్కున్నారా.? అన్నదానిపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలున్నాయి. అమరావతిని తరలించట్లేదంటూనే, అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌నీ, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌నీ వేరు చేసేందుకు ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ‘అబ్బే, ఆ అవకాశమే లేదు. ఎందుకంటే, అగ్రిమెంట్లు అంత పక్కాగా వున్నాయి.. రైతులకీ – సీఆర్డీయేకీ జరిగిన ఒప్పందాలు చాలా స్ట్రాంగ్‌..’ అని టీడీపీ చెబుతోంది. చంద్రబాబు హయాంలో రైతులు ప్రభుత్వానికి రాజధాని కోసం భూములు ఇచ్చిన మాట వాస్తవం. ప్రలోభపెట్టారు, బెదిరింపులకు దిగారు.. పొలాలు తగలబెట్టారు కూడా.!

30 వేల ఎకరాలకు పైగా భూముల్ని రైతులు, ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ క్రమంలో కొన్ని అగ్రిమెంట్లు జరిగాయి. ఆ అగ్రిమెంట్లు చాలా చాలా స్ట్రాంగ్‌ అని టీడీపీ మొదటినుంచీ చెబుతూ వస్తోంది. అవి అంత స్ట్రాంగ్‌గా వున్నాయి కాబట్టే, క్యాపిటల్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని (ఏపీ సీఆర్‌డీఏ) రద్దు చేసి, దాని స్థానంలో అమరావతి మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో వుందనుకోండి.. అది వేరే విషయం. ఈ నెల 14వ తేదీ వరకు రాజధానిని తరలించేందుకు వీల్లేని పరిస్థితి.

మరి, ఆ తర్వాత ఏం జరుగుతుంది.? ఈ విషయమై న్యాయ నిపుణులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ మాటల్లో అయితే, ఒప్పందాలు చాలా స్ట్రాంగ్‌గా వున్నాయనే అర్థమవుతోంది. ఈ ప్రభుత్వానికి సీఆర్డీయేని రద్దు చేసే అధికారమే లేదని ఆయన అంటున్నారు. అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గానీ, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌నిగానీ తరలించడానికి వీలు పడదట. అసలు అసెంబ్లీలో ఈ విషయమై పాస్‌ అయిన బిల్లుల్లోనే అర్థం లేదని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోపక్క, అమరావతి కోసం భూములిచ్చిన రైతులు పైకి ‘ధైర్యంగా’నే కన్పిస్తున్నా, లోలోపల మాత్రం ‘భయాందోళనలు’ వారిని వెంటాడుతున్నాయి. ఆ అగ్రిమెంట్ల విషయంలో గతంలోనే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. మరింత పకడ్బందీగా ఒప్పందాలు వుండాలని ఇటు రైతుల్ని అప్రమత్తం చేస్తూనే, అటు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

ఇక, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వెర్షన్‌ ఇంకోలా వుంది. లక్ష కోట్లు ఖర్చు చేసి అమరావతిని నిర్మించే పరిస్థితి లేదంటోంది జగన్‌ సర్కార్‌. అందులో సగం సొమ్ము వెచ్చించినా, రాష్ట్రంలో మూడు రాజధానులు అత్యద్భుతంగా ఏర్పడతాయన్నది జగన్‌ సర్కార్‌ వాదన. చంద్రబాబు హయాంలో జరిగిన ఒప్పందాల్లో పస లేదనీ, సీఆర్డీయే రద్దు కావొచ్చు.. మూడు రాజధానుల ఏర్పాటు కావొచ్చు.. ఈ వ్యవహారాల్లో ఆ ఒప్పందాలు అడ్డంకి కావనీ, సీఆర్డీయే రద్దు విషయంలోనూ తమకు సమస్యలేమీ వుండవని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇంతకీ ఏది నిజం.? తేల్చాల్సింది న్యాయస్థానాలే.!

3 COMMENTS

  1. 736885 396387It was any exhilaration discovering your internet site yesterday. I arrived here nowadays hunting new items. I was not necessarily frustrated. Your concepts soon after new approaches on this thing have been useful plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 939114

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...