రాజధాని అమరావతి కోసం రైతులు భూములిచ్చారు. స్వచ్ఛందంగా ఇచ్చారా.? బాలవంతంగా లాక్కున్నారా.? అన్నదానిపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలున్నాయి. అమరావతిని తరలించట్లేదంటూనే, అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్నీ, జ్యుడీషియల్ క్యాపిటల్నీ వేరు చేసేందుకు ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ‘అబ్బే, ఆ అవకాశమే లేదు. ఎందుకంటే, అగ్రిమెంట్లు అంత పక్కాగా వున్నాయి.. రైతులకీ – సీఆర్డీయేకీ జరిగిన ఒప్పందాలు చాలా స్ట్రాంగ్..’ అని టీడీపీ చెబుతోంది. చంద్రబాబు హయాంలో రైతులు ప్రభుత్వానికి రాజధాని కోసం భూములు ఇచ్చిన మాట వాస్తవం. ప్రలోభపెట్టారు, బెదిరింపులకు దిగారు.. పొలాలు తగలబెట్టారు కూడా.!
30 వేల ఎకరాలకు పైగా భూముల్ని రైతులు, ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ క్రమంలో కొన్ని అగ్రిమెంట్లు జరిగాయి. ఆ అగ్రిమెంట్లు చాలా చాలా స్ట్రాంగ్ అని టీడీపీ మొదటినుంచీ చెబుతూ వస్తోంది. అవి అంత స్ట్రాంగ్గా వున్నాయి కాబట్టే, క్యాపిటల్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీని (ఏపీ సీఆర్డీఏ) రద్దు చేసి, దాని స్థానంలో అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో వుందనుకోండి.. అది వేరే విషయం. ఈ నెల 14వ తేదీ వరకు రాజధానిని తరలించేందుకు వీల్లేని పరిస్థితి.
మరి, ఆ తర్వాత ఏం జరుగుతుంది.? ఈ విషయమై న్యాయ నిపుణులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ మాటల్లో అయితే, ఒప్పందాలు చాలా స్ట్రాంగ్గా వున్నాయనే అర్థమవుతోంది. ఈ ప్రభుత్వానికి సీఆర్డీయేని రద్దు చేసే అధికారమే లేదని ఆయన అంటున్నారు. అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గానీ, జ్యుడీషియల్ క్యాపిటల్నిగానీ తరలించడానికి వీలు పడదట. అసలు అసెంబ్లీలో ఈ విషయమై పాస్ అయిన బిల్లుల్లోనే అర్థం లేదని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోపక్క, అమరావతి కోసం భూములిచ్చిన రైతులు పైకి ‘ధైర్యంగా’నే కన్పిస్తున్నా, లోలోపల మాత్రం ‘భయాందోళనలు’ వారిని వెంటాడుతున్నాయి. ఆ అగ్రిమెంట్ల విషయంలో గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. మరింత పకడ్బందీగా ఒప్పందాలు వుండాలని ఇటు రైతుల్ని అప్రమత్తం చేస్తూనే, అటు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
ఇక, వైఎస్ జగన్ ప్రభుత్వం వెర్షన్ ఇంకోలా వుంది. లక్ష కోట్లు ఖర్చు చేసి అమరావతిని నిర్మించే పరిస్థితి లేదంటోంది జగన్ సర్కార్. అందులో సగం సొమ్ము వెచ్చించినా, రాష్ట్రంలో మూడు రాజధానులు అత్యద్భుతంగా ఏర్పడతాయన్నది జగన్ సర్కార్ వాదన. చంద్రబాబు హయాంలో జరిగిన ఒప్పందాల్లో పస లేదనీ, సీఆర్డీయే రద్దు కావొచ్చు.. మూడు రాజధానుల ఏర్పాటు కావొచ్చు.. ఈ వ్యవహారాల్లో ఆ ఒప్పందాలు అడ్డంకి కావనీ, సీఆర్డీయే రద్దు విషయంలోనూ తమకు సమస్యలేమీ వుండవని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇంతకీ ఏది నిజం.? తేల్చాల్సింది న్యాయస్థానాలే.!
887028 103220Hey, you used to write excellent, but the last few posts have been kinda boringK I miss your super writings. Past couple of posts are just a bit out of track! come on! 293693
736885 396387It was any exhilaration discovering your internet site yesterday. I arrived here nowadays hunting new items. I was not necessarily frustrated. Your concepts soon after new approaches on this thing have been useful plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 939114
176261 172762Excellent publish from specialist also it will probably be a amazing know how to me and thanks extremely significantly for posting this beneficial data with us all. 904995