మూడేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు సందర్భంగా కొత్తగా తీసుకొచ్చిన రెండు వేల రూపాయల నోటును మార్కెట్ నుంచి తొలగించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శుక్రవారం నుంచి ఖాతాదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఖాతాదారుల నుంచి మామూలుగానే రూ.2వేల నోట్లు తీసుకుంటాయి. కానీ తమకు వచ్చిన నోట్లను వచ్చినట్టుగా రిజర్వు బ్యాంకుకు పంపిస్తాయి. వాటిని తిరిగి ఖాతాదారులకు ఇవ్వవు. అదే సమయంలో ఏటీఎంలలో కూడా రూ.2వేల నోట్లను పెట్టరు.
నిజానికి రెండు వేల రూపాయల నోట్లను కేంద్రం వెనక్కి తీసుకుంటుందని గతంలో కూడా చాలాసార్లు ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. అయితే వాటి వినియోగాన్ని బ్యాంకులు క్రమంగా తగ్గిస్తూ వచ్చాయి. ప్రస్తుతం వాటిని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించాయి.
మూడేళ్ల క్రితం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం.. రూ.2వేల నోటును తీసుకొచ్చింది. దీనిపై విమర్శలు వచ్చాయి. పెద్ద నోట్ల వల్ల నల్లధనం పెరుగుతుందన్న కేంద్రమే ఏకంగా రూ.2వేల నోటును తీసుకురావడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. అయితే, అప్పట్లో మార్కెట్ లో చెలామణి కోసం ఆ నోటును కొనసాగించారు. ప్రస్తుతం రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లు విరివిగా చెలామణిలోకి రావడంతో ఇక రూ.2వేల నోటును వెనక్కి తీసుకోవాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
పాకిస్తాన్ లో మన రూ.2వేల నకిలీ నోట్లను విపరీతంగా ప్రింట్ చేశారనే అనుమానాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తే ప్రజల్లో ఆందోళనలు చోటు చేసుకుంటాయనే భావనతో బ్యాంకులకు వచ్చిన నోట్లను రిజర్వు బ్యాంకుకు తరలించాలని నిర్ణయం తీసుకుంది. వాటిని తిరిగి చెలామణిలో పెట్టకుండా, క్రమంగా మొత్తం రూ.2వేల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని భావిస్తోంది.
685620 140508Superb read, I just passed this onto a colleague who was performing a little research on that. And he truly bought me lunch as I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 23602
146268 252670The great intreguing articles maintain me coming back here time and time again. thank you so much. 134678
736775 120343You ought to join in a contest for starters of the highest quality blogs online. I will recommend this page! 834357