ఎన్నికల్లో గెలవడానికి డబ్బులు పంచుతారు.. అసెంబ్లీకి వెళతారు, పార్లమెంటుకీ వెళతారు.. మంత్రి పదవులూ దక్కించుకుంటారు.. కానీ, బాధ్యత మాత్రం వుండదు. ఏదన్నా పెద్ద సమస్య వస్తే, ‘పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడంలేదు..’ అంటూ అమాయకంగా మాట్లాడేస్తుంటారు.
సమస్య వచ్చినప్పుడు మాత్రమే. ఆంధ్రపదేశ్లో అందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు గుర్తుకొస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉద్యమంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళాలట.. కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలట. ఇది విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు పేరుతో పొలిటికల్ డ్రామాకి తెరలేపిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉవాచ.
ఆయన టీడీపీలో వున్నారో, లేదో ఆయనకీ తెలియదు, టీడీపీ అధినేతకీ తెలియదు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచే గెలిచారుగానీ, ఆ తర్వాత పార్టీ మారేందుకు నానా రకాల ప్రయత్నాలూ చేసి.. రాజకీయాల్లో వున్నా లేనట్టే వ్యవహరిస్తున్నారు. విశాఖ ఉక్కు వ్యవహారం తెరపైకొచ్చాక.. గంటా, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఆ పేరుతో నానా హంగామా చేసేస్తున్నారు.
ప్రత్యేక హోదా కోసం ఎందుకు రాజీనామా చేయలేదు.? విశాఖ రైల్వో జోన్ కోసం ఎందుకు రాజీనామా చేయలేదు.? ఎందుకంటే, వాటి కోసం రాజీనామా చేస్తే, ఆయనకు రావాల్సిన పబ్లిసిటీ రాదు కాబట్టి. వైసీపీ నేతలూ పవన్ కళ్యాణ్నే ప్రశ్నిస్తున్నారు.. టీడీపీది కూడా ఇదే పరిస్థితి. చూస్తోంటే, తెలుగుదేశం పార్టీ కంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఆంధ్రపదేశ్లో జనసేన పార్టీనే బలమైన రాజకీయ పార్టీగా అందరూ గుర్తిస్తున్నట్టుంది.
జనసేన అధినేత విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో ఆయన్ని చాలామంది ఎగతాలి చేశారు. జనం ఆయన్ని తరిమికొట్టారన్నారు. అలా అన్నోళ్ళంతా ఇప్పుడు పవన్ తప్ప, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపే సత్తా ఇంకెవరికీ లేదని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. దటీజ్ పవన్ కళ్యాణ్.
412977 491499very good post. Neer knew this, thanks for letting me know. 785507
268323 391101What a lovely weblog. Ill surely be back once more. Please preserve writing! 600333
552856 210425Its superb as your other articles : D, regards for posting . 216829
420803 578699Wonderful post will probably be linking this on some sites of mine maintain up the very good function. 965146