‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి ‘అల వైకుంఠపురములో’ గట్టిగానే దెబ్బేసిందని తేలిపోయింది. 100 కోట్ల క్లబ్లో ‘సరిలేరు నీకెవ్వరు’ చేరిపోయిందంటూ నిర్మాతలు అధికారికంగా ఇప్పటికే ప్రకటించేసినా, ఆ వసూళ్ళపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. చాలా నెగెటివిటీ ప్రచారంలోకి వస్తోంది. మరోపక్క ‘అల వైకుంఠపురములో’ సినిమాకి నెగెటివిటీ చాలా చాలా తక్కువగా కన్పిస్తోంది.
ఓవర్సీస్లో వార్ వన్ సైడ్ అయిపోయిన మాట వాస్తవం. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ 2 మిలియన్ క్లబ్లోకి చేరిపోయింది. ఫుల్ రన్లో 3 మిలియన్ మార్క్ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరోపక్క, ‘సరిలేరు నీకెవ్వరు’ ఓవర్సీస్లో నష్టాల్ని చవిచూడాల్సిందేనని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇక, నైజాం వసూళ్ళ విషయానికొస్తే, ఇక్కడ తొలుత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాదే పై చేయి అన్న ప్రచారం జరిగింది. అయితే, తాజా లెక్కలు చూస్తే, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’తో పోల్చితే వెనకబడి వున్నట్లు తెలుస్తోంది. రెండిటికీ మధ్య 2 నుంచి 3 కోట్ల దాకా గ్యాప్ వుందట. ఇది నిజమేనా.? అంటే, అస్సలేమాత్రం నిజాన్ని అంగీకరించలేకపోతున్నారు మహేష్ అభిమానులు.
30 కోట్లు దాటేసింది నైజాంలో.. అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ గురించి మహేష్ అభిమానులు చెబుతున్నారు. ఇవన్నీ షేర్ లెక్కలు. మరోపక్క, ‘అల వైకుంఠపురములో’ ఒక్కటే 30 కోట్ల క్లబ్లోకి చేరబోతోంది నైజాంలో.. అంటూ అల్లు అర్జున్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే, మహేష్బాబు తన సినిమా ప్రమోషన్స్లో బిజీగా వున్నాడు.. అల్లు అర్జున్ సైతం ప్రమోషనల్ ఈవెంట్స్ మీద దృష్టిపెట్టిన విషయం విదితమే.
945340 598964Cheapest speeches and toasts, as effectively as toasts. probably are produced building your own at the party and will be most likely to turn into witty, humorous so new even. greatest man toast 396912
695108 911339I came towards the exact conclusion as properly some time ago. Fantastic write-up and I will probably be certain to look back later for a lot more news. 767799