టీం ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా లో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా ఆటగాళ్లు వలయం దాటి బయటకు వెళ్లడం కాని బయట వస్తువులను తాకడం కాని, తినడం కాని ఇతర వ్యక్తులను కనీసం టచ్ చేయడం కాని చేయకూడదు.
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసిన వలయంలో మాత్రమే ఉండాలని ముందు నుండి హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. ఇటీవల ఆస్ట్రేలియాలో కొంత మంది టీం ఇండియా ఆటగాళ్లు రెస్టారెంట్ కు వెళ్లడంతో పాటు ఒక అభిమానితో కలిసి ఫొటో దిగడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఒక రెస్టారెంట్ లో టీం ఇండియా ఆటగాళ్లు కూర్చుని ఉండగా పక్క టేబుల్ వద్ద కూర్చున్న టీం ఇండియా అభిమాని నవల్దీప్ సింగ్ వారి బిల్లును ఆటగాళ్లకు తెలియకుండా చెల్లించాడు. బిల్లు చెల్లించేందుకు వెళ్లిన సమయంలో అప్పటికే చెల్లించారంటూ చెప్పడంతో ఆటగాళ్లు అతడి డబ్బును తిరిగి తీసుకోవాల్సిందిగా కోరారు. అందుకు ఆయన నిరాకరించాడు, అది తన అభిమానంగా భావించాలని కోరాడు. దాంతో అతడితో ఫొటో దిగారు.
ఆ సమయంలో పంత్ నన్ను ఆలింగనం చేసుకున్నాడు అంటూ అభిమాని సోషల్ మీడియాలో చెప్పాడు. దాంతో టీం ఇండియా ఆటగాళ్లు ఐసోలేషన్ లో ఉండాలంటే క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశించింది. వివాదం ముదరడంతో అతడు స్పందించాడు. కేవలం ఫొటో దిగి మాత్రమే వచ్చాను. ఆలింగనం ఏమీ చేసుకోలేదు అన్నాడు.