ఎన్టీఆర్ బుల్లి తెరపై రీ ఎంట్రీకి ఎవరు మీలో కోటీశ్వరులు షో తో రంగం సిద్దం అయ్యింది. బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఈయన హోస్టింగ్ చేసిన సమయంలో ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో.. ఆ షో కు ఏ రేంజ్ లో మంచి రేటింగ్ వచ్చిందో తెల్సిందే. అందుకే ఇప్పుడు ఈయన చేయబోతున్న బుల్లి తెర షో ఇప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నింటిని కూడా బ్రేక్ చేస్తుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు మీలో కోటీశ్వరులు కూడా బిగ్గెస్ట్ షో గా తెలుగు లో నిలుస్తుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు.
షో ను ప్రకటించి చాలా నెలలు అవుతుంది. కాని ఇప్పటి వరకు షో ముందుకు వెళ్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కరోనా కారణంగా షో ను హోల్డ్ లో పెట్టారు. గత రెండు నెలలుగా షో గురించిన అప్ డేట్ లేకపోవడంతో ఈ ఏడాదికి లేనట్లే అంటూ కొందరు.. మొత్తానికి క్యాన్సిల్ అయ్యిందేమో అంటూ కొందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. మీడియాలో జరుగుతున్న ప్రచారంకు బ్రేక్ వేసేలా ఎవరు మీలో కోటీశ్వరులు కొత్త ప్రోమోను విడుదల చేశారు. అందులో కమింగ్ సూన్ అంటూ వేశారు. ఇప్పటికే చాలా సార్లు కమింగ్ సూన్ ప్రోమో విడుదల అయ్యింది. మరోసారి అదే తరహా ప్రోమో ను జెమిని విడుదల చేయడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
304643 204816I feel this web site contains some very very good info for everyone : D. 409658
839854 595227Id always want to be update on new weblog posts on this internet web site , bookmarked ! . 32055