పూరి జగన్నాథ్.. తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు.. దారుణ పరాజయాలూ చవిచూశాడు. స్టార్ డైరెక్టర్ అనే ట్యాగ్లైన్ మాత్రం ఎప్పుడూ ఆయనతోనే వుంది. కాలం ఎప్పుడూ ఒకేలా వుండదంటాడు పూరి జగన్నాథ్. అవును, కాలం విలువ ఆయనకే బాగా తెలుసు. ఆ కాలం కొట్టిన దెబ్బకి ఆర్థికంగా చితికిపోయినా, పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అవుతూనే వుంటాడు.
పూరి కనెక్ట్స్ పేరుతో పూరి చాలాకాలం క్రిందటే సరికొత్త ప్రయాణం సాగించాడు. టాలెంట్ని వెలికి తీయడం, సినిమాల్ని నిర్మించడం ఈ పూరి కనెక్ట్స్ పని. ఒకప్పటి హీరోయిన్ ఛార్మితో కలిసి పూరి కనెక్ట్స్ని నిర్వహిస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈ ఇద్దరూ ఇప్పుడు ఓ గొప్ప పని చేపట్టారు. నిజానికి దీన్నొక పనిగా అనుకోలేదు.. బాధ్యతగా అనుకున్నారు. అవకాశాలు సన్నగిల్లి, ఆర్థికంగా చితికిపోయిన ఒకప్పటి దర్శకులకీ, దర్శకత్వ శాఖలో పనిచేసినవారికీ ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు పూరి జగన్నాథ్, ఛార్మి. ఈ మేరకు 20 మందిని ఎంపిక చేశారు. వారందరికీ తమకు చేతనైన మేర ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చారు.
‘ప్రేమతో అంగీకరించండి. ఇదేమీ పెద్ద సాయం కాదు. చిన్న చిరునవ్వు లాంటి పలకరింపు అంతే. మా ఈ చిన్న సాయం మీకు ఏమాత్రం ఊరటనిచ్చినా చాలు.. అది మా ప్రయాణానికి ఆశీస్సులుగా భావిస్తాము. మేము తలపెట్టే ఇలాంటి ఓ మంచి కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము..’ అని పేర్కొనడంలోనే పూరి జగన్నాథ్, ఛార్మి తమ మనసు ఎంత గొప్పదో చెప్పేశారు.
‘మేం బతికి వున్నంత కాలం ఇదే విధంగా దేవుడు శక్తి ఇచ్చినట్లయితే మేం ప్రతి సంవత్సరం ఇలాగే సాయం చేయాలని అనుకుంటున్నాం..’ అని పూరి, ఛార్మి పేర్కొన్నారు. పూరి మాత్రమే కాదు, చార్మి కూడా తన గొప్ప మనసుని చాటుకుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సక్సెస్ నేపథ్యంలో పూరి, ఛార్మి తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని ఎవరైనా అభినందించి తీరాల్సిందే.
870659 616059I got what you mean , saved to bookmarks , really decent web site. 654981