టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా చంద్రబాబు సూచించారు. నిన్న ఆయన తనయుడు లోకేశ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రోజు వ్యవధిలో ఇద్దరూ కరోనా బారిన పడటం టీడీపీ నేతలకు ఆందోళన రేకెత్తిస్తోంది.
మరోవైపు టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు కూడా కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలిందని సోషల్ మీడియాలో తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా సూచించారు.
రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కొడాలి నాని, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు.. ఇలా పలువురు ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు.
640172 802752How much of an exclusive write-up, maintain on posting much better half 232912
242122 764916Spot on with this write-up, I truly assume this web site wants significantly more consideration. probably be once more to read a lot a lot more, thanks for that information. 244970
404046 26907This is some fantastic data. I expect additional facts like this was distributed across the internet today. 63700