తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి ఎక్కువగానే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో సినీ, టీవీ సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోయాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఇటివలే షూటింగ్స్ కు పర్మిషన్స్ ఇచ్చారు.
దీంతో కొన్ని సినిమాల షూటింగ్స్ తో పాటు సీరియల్స్, ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా షూటింగ్ జరుపుకున్నాయి. అయితే కరోనా తీవ్రత వీటిపై కూడా పడింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్ చేసినా కొందరు నటులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎంతో ప్రజాదరణ పొందిన జబర్దస్త్ ప్రోగ్రామ్ కు కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. హైపర్ ఆది టీమ్ లోని మెంబర్ కు కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఇటివల అనారోగ్యం కారణంగా జరిపిన టెస్టుల్లో సదరు పార్టిసిపెంట్ కు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలుస్తోంది.
దీంతో హైపర్ ఆది టీమ్ మొత్తం సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ప్రొగ్రామ్ ను నిలిపేశారని తెలుస్తోంది. రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో జూలై31 వరకూ లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలబ్రిటీలకే కాకుండా పలువురు రాజకీయ నాయకులకు కూడా ఈ వైరస్ సోకడం ఆందోళన రేకెత్తిస్తోంది.
731251 34627This web site is my breathing in, quite great layout and perfect content material material . 981804
986573 218487Hi there! Good post! Please do tell us when I could see a follow up! 2285