రాజకీయాల్లోకి వచ్చాక ఎవరిపైనైనా విమర్శలు తప్పవు. ఏదో ఒక విషయంలో వారిని విమర్శించడానికి, ఎలాగైనా వారిని ఇరుకున పెట్టడానికి ప్రత్యర్థులు ఎదురుచూస్తుంటారు. ఏదో ఒక విధంగా వారిపై ఆరోపణలు చేయాలన్నదే కొంతమంది లక్ష్యంగా కనిపిస్తుంది. సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కొంతమందికి టార్గెట్ గా మారారు. ఆయన ఏం చేసినా అందులో తప్పులు ఎత్తిచూపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఏపీ అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో ఆయన క్యూలో నుంచోకుండా నేరుగా వెళ్లి ఓటేశారంటూ, ఈ క్రమంలో లైన్లో ఉన్నవారిని తోసుకుంటూ వెళ్లిపోయారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఎంత పవన్ అయితే మాత్రం లైన్లో ఉండకుండా నేరుగా వెళ్ళిపోతారా అంటూ పలువురు ప్రశ్నలవర్షం కురిపించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విమర్శలు చేశారు. కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు కూడా ఈ విషయాన్ని బాగా హైలైట్ చేశాయి. ఈ క్రమంలో వాస్తవాలను విస్మరించారని జనసైనికులు చెబుతున్నారు. అక్కడ జరిగింది ఒకటైతే, ఆయా పత్రికలు, ఛానళ్లు మరోలా చూపించాయని మండిపడుతున్నారు. ముఖ్యంగా ఓ ఇంగ్లిష్ ఛానల్ ఈ విషయంలో వాస్తవాన్ని మరుగునపరిచేలా వ్యవహరించిందని, తెలుగు మీడియా కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం రిపోర్ట్ చేసిందని విమర్శిస్తున్నారు.
గురువారం ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చారు. తొలుత ఆయన లైన్లోనే నిల్చున్నారని, ఈ క్రమంలో పలువురు ఓటర్లు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారని, దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పోలీసులే ఆయన వద్దకు వచ్చి లైన్లో కాకుండా నేరుగా వెళ్లి ఓటేసి, త్వరగా వెళ్లిపోవాలని సూచించినట్టు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీంతో పవన్ పోలీసుల సూచన మేరకు లైన్లో నుంచి బయటకు వచ్చి నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బందితోపాటు అభిమానులు ఆయన్ను అనుసరించడంతో లైన్లో ఉన్నవారిలో కొంతమందికి అసౌకర్యం కలిగింది. దీంతో వారంతా పవన్ లైన్లో ఉండకుండా నేరుగా వెళ్లిపోతున్నారని భావించారని జనసైనికులు చెబుతున్నారు.
ఈ విషయంపై కొంతమంది మాట్లాడుతూ పవన్ వైఖరిని తప్పుబట్టారని, దీంతో జరిగిన సంగతి చెప్పడానికి అక్కడే ఉన్న ఓ యువకుడు ప్రయత్నించినా.. జాతీయ మీడియాకు చెందిన రిపోర్టర్ అతడిని మధ్యలోనే అడ్డుకుని తన అవాస్తవ రిపోర్టింగ్ కొనసాగించారని విమర్శించారు. ఫలానా పార్టీకి అనుకూలంగా పనిచేసే క్రమంలో మీడియా ఇలా ఇతరులపై అభాండాలు వేయకూడదని, అవాస్తవాలు ప్రచారం చేయకూడదని హితవు పలికారు. ఇదే విషయాన్ని ఆ ఛానల్ ట్విటర్ లో ప్రస్తావించడంతో అసలు సంగతి అర్థమై జనసైనికులతోపాటు సగటు పౌరులు ఆ ఛానల్ పై దుమ్మెత్తి పోశారు. ఈ అంశంపై ప్రముఖ సినీ దర్శకుడు మారుతి కూడా స్పందించారు. ఏదో సెన్సేషన్ సృష్టించాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేయొద్దని సదరు ఛానల్ ప్రతినిధికి సూచించారు. అక్కడ జరిగిందేమిటో చెబుతున్న వ్యక్తిని మధ్యలోనే ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
Mam pls don't try to "sensationalize" things. If surrounded situation is like that can @PawanKalyan garu create more ruckus by standing at que? At least LISTEN PROPERLY what the red shirt person at the location (in Que) saying. Why U cut down his voice in middle? @CNNnews18 pic.twitter.com/HM98ddCFvQ
— Maruthi director (@DirectorMaruthi) April 11, 2019
25927 482699I believe this web website has quite superb composed topic material articles . 658062
668864 395178The planet are really secret by having temperate garden which are typically beautiful, rrncluding a jungle that is surely undoubtedly profligate featuring so many systems by way of example the game courses, golf approach and in addition private pools. Hotel reviews 709206