కరోనా మహమ్మారి మరో ముఖ్య నేతను బలి తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. సోనియా గాంధీకి అత్యంత సన్నిహిత వ్యక్తిగా, వ్యక్తిగత సలహాదారుడిగా వ్యవహరించి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అహ్మద్ పటేల్ కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెల రోజులుగా ఆయన ఆరోగ్యం ఏమాత్రం సరిగా లేదు. కరోనా వల్ల ఆయన అవయవాల పని తీరు పూర్తిగా చెడిపోయాయి. వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందించారు. ఇటీవల ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది అంటూ ప్రచారం జరిగింది.
నేడు తెల్లవారు జామున 3.30 కి అహ్మద్ పటేల్ మృతి చెందినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ నెల 15 నుండి ఆయన ఐసీయూలో ఉన్నారు. ఎనిమిది సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక అయిన అహ్మద్ పటేల్ కు గాంధీ కుటుంబ సన్నిహితుడిగా పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా వ్యూహకర్తగా ఆయన నిలిచారు. ఆయన లోటు ఈ సమయంలో పార్టీకి తీరని లోటు అంటూ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో రాష్ట్రాల్లో ఉన్న పార్టీ విభేదాలను.. జాతీయ స్థాయి నాయకుల్లో ఉన్న గొడవలను సామరస్యంగా పరిష్కరించడంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. అహ్మద్ పటేల్ మృతిపై ప్రముఖులు సంతాపం తెలియజేశారు. రాజ్యసభ చైర్మన్ అయిన వెంకయ్య నాయుడు ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
320226 309159I dont generally comment but I gotta say thankyou for the post on this incredible 1 : D. 816629
166054 296000Real great information can be discovered on internet blog . 928032
81482 451731Outstanding post, I conceive people ought to larn a good deal from this web site its genuinely user genial . 65503