హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమన్లు పంపిన నేపధ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ఏప్రిల్ 26వ తేదీ వరకూ స్టే విధించింది.
ఇటివలే నాంపల్లి కోర్టు ఆయనకు సమన్లు పంపిన సంగతి తెలిసిందే. 2014లో తెలంగాణలోని హుజూర్ నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించారని జగన్ పై కేసు నమోదైంది. ఈ కేసు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కేసుల విచారణ న్యాయస్థానానికి చేరింది. దీంతో మార్చి 28న కోర్టుకు హాజరు కావాలని జగన్ కు సమన్లు పంపింది.
అయితే.. నిర్ణీత సమయంలో సమన్లు జగన్ కు అందలేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలపడంతో మరోసారి సమన్లు పంపాలని కోర్టు ఆదేశించింది. ఈనేపథ్యంలో మరోసారి సమన్లు అందడంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
211744 632277Really great post, thanks a great deal for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 157653
407630 173616Im not confident why but this weblog is loading extremely slow for me. Is anyone else having this issue or is it a problem on my finish? Ill check back later and see if the problem still exists. 303747