ఐపీఎల్ వేలం మొదలైంది. ఆసీస్ క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ సంచలనం నమోదు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాక్స్వెల్ ను రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. మాక్స్వెల్ పై రూ.5 కోట్ల నుంచి ధర ప్రారంభమైంది. చెన్నై, బెంగళూరు విపరీతంగా పోటీపడ్డాయి. చెన్నై వద్ద పెద్ద మొత్తం లేకపోవడంతో రూ.14 కోట్ల వరకు వెళ్లగలిగింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ మాక్స్వెల్ ను దక్కించుకుంది. మరోవైపు ఈ ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా క్రికెటర్ క్రిస్ మోరిస్ నిలిచాడు.
రాజస్థాన్ రాయల్స్ అతడిని ఏకంగా 16.25కోట్లకు దక్కించుకుంది. ముంబయ్ ఇండియన్స్ పోటీ పడినా.. 12 కోట్ల వద్ద పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఎక్కువ మొత్తం. మరోవైపు ఇంగ్లాండ్ క్రికెటర్, టీ20 నెంబర్ వన్ ఆటగాడు డేవిడ్ మలన్ ను పంజాబ్ కింగ్స్ 1.5 కోట్లకే దక్కించుకుంది.
299753 630522Quite great publish, thanks a good deal for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 996552
154613 561988The website loading velocity is amazing. 279261