అవును.. ఇది ముమ్మాటికీ నిజం.! తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారి అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అడుగులేస్తున్నారు. ‘ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడుగుతూనే వుంటాం..’ అని గతంలో ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వున్న వైఎస్ జగన్ కూడా అదే మాట చెబుతున్నారు.
అదొక్కటే కాదు, చాలా విషయాల్లో చంద్రబాబుకీ, వైఎస్ జగన్కీ స్పష్టమైన పోలికలున్నాయి. జనసేన మాటల్లో చెప్పాలంటే ‘టీడీపీ – వైసీపీ’ది ’60-40’ బంధం. అవుననడానికి చాలా సాక్ష్యాలు కన్పిస్తున్నాయి. తాజాగా శాసన మండలి రద్దు విషయానికొస్తే చంద్రబాబు – వైఎస్ జగన్ ఒకే మాట మీద నిలబడినట్లు కన్పిస్తోంది. అయితే, ఒకప్పటి చంద్రబాబే ఇప్పుడు వైఎస్ జగన్.!
మొన్న గురువారం అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ చేసిన ప్రసంగాన్నీ, చాలాకాలం క్రితం చంద్రబాబు చేసిన ప్రసంగాన్నీ పరిశీలించినప్పుడు ఆ విషయం స్పష్టమవుతుంది. చంద్రబాబు గతంలో శాసన మండలిని వ్యతిరేకించారు. దానికి ఆయన చెప్పిన కారణాల్లో ‘రాష్ట్రంపై ఆర్థిక భారం’ అనే అంశం కీలకమైనది. స్వర్గీయ ఎన్టీఆర్ శాసన మండలిని రద్దు చేస్తే, దాన్ని వైఎస్ రాజశేఖర్రెడ్డి పునరుద్ధరించిన విషయం విదితమే. వైఎస్ ప్రభుత్వాన్ని అప్పట్లో చంద్రబాబు నిలదీశారు.
చిత్రమేంటంటే.. ఇప్పుడు మండలి రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తీసుకున్నారు. దానికి గతంలో చంద్రబాబు చెప్పిన కారణాల్నే వైఎస్ జగన్ ఉదహరిస్తుండడం గమనార్హం. కానీ, మండలి రద్దుని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తుండడం గమనార్హం. మొత్తమ్మీద, ‘రాజన్న రాజ్యం’ తెస్తా.. అని ప్రజలకు చెబుతున్నప్పటికీ, తన తండ్రి అడుగు జాడల్లో నడవలేకపోతున్న వైఎస్ జగన్, చిత్రంగా తనకు రాజకీయ విరోధి అయిన నారా చంద్రబాబునాయుడిని ఫాలో అవుతుండడం విశేషమే మరి.
484468 252485As I website possessor I believe the topic material here is rattling amazing , appreciate it for your efforts. 611112
912857 589576Greetings! This really is my initial comment here so I just wanted to give a quick shout out and let you know I genuinely enjoy reading via your blog posts. Can you recommend any other blogs/websites/forums that deal with the same topics? Thank you so considerably! 2386