Switch to English

బిల్డ్‌ ఏపీ కేసు: ఐఏఎస్‌ అధికారికి హైకోర్టు అక్షింతలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బిల్డ్‌ ఏపీ.. పేరు మాత్రం, ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం. కానీ, జరుగుతున్నది భూముల అమ్మకం.. అన్న విమర్శలు విపక్షాల నుంచి చాన్నాళ్ళుగా వినిపిస్తున్నాయి. నిజానికి, ‘బిల్డ్‌ ఏపీ’ అంటూ, ఆంధ్రప్రదేశ్‌ని కొత్తగా ఇప్పటిదాకా నిర్మించింది ఏమీ లేదు. అంతెందుకు, రాజధాని అమరావతిలో ఒక్క ఇటుక కూడా కొత్తగా పెట్టింది లేదు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక.

ఇంతకీ, ఈ ‘బిల్డ్‌ ఏపీ’ ఏం చేస్తోంది.? ఏమోగానీ, బిల్డ్‌ ఏపీకి సంబంధించి హైకోర్టులో నమోదైన ఓ కేసు విచారణ సందర్భంగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ హైకోర్టు నుంచి ఊహించని షాక్‌ని ఎదుర్కోవాల్సి వచ్చింది. న్యాయస్థానం చెయ్యని వ్యాఖ్యల్ని చేసినట్లుగా చూపుతూ, ఏకంగా అఫిడవిట్‌ దాఖలు చేయడం గమనార్హమిక్కడ.

‘మీడియాలో ఆ వ్యాఖ్యలు వచ్చాయి..’ అని విచారణ సందర్భంగా ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ తరఫు న్యాయవాది పేర్కొనగా, అందుకు తగ్గ ఆధారాలు చూపాలని న్యాయస్థానం అడిగితే, ఆధారాలు చూపించలేక చతికిలపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది బిల్డ్‌ ఏపీ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌ కుమార్‌పై. తక్షణం ఆయనపై కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

నిజానికి, వైసీపీ నేతలు.. న్యాయస్థానాలకు దురుద్దేశాలు ఆపాదించడం కొత్తేమీ కాదు. ఆ వైసీపీ నేతల కనుసన్నల్లో అధికారులు నడవబట్టే, ఇప్పుడీ దుస్థితి.. అన్న చర్చ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌పై కోర్టు అక్షింతల ఎపిసోడ్‌కి సంబంధించి జనంలో జరుగుతోంది. ఐఏఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రార్‌నీ ఆదేశించడం గమనార్హం.

కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాల్సిందిగా చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కి కూడా సూచించింది ఉన్నత న్యాయస్థానం. ఇటీవలి కాలంలో ఇంత తీవ్రంగా ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి అనుకోవచ్చేమో.! కొన్నాళ్ళ క్రితం ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసిన వ్యవహారానికి సంబంధించి, హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేసినా, అధికారులు.. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ, రంగుల విషయంలో నానా రకాల డ్రామాలు ఆడిన విషయం విదితమే.

రాజకీయ నాయకులు తమ పైత్యాన్ని జనం మీద రుద్దాలనుకోవడం సహజమే. కానీ, అధికారులకేమయ్యింది.? ఏది మంచో, ఏది చెడో.. అధికారంలో వున్నవారికి చెప్పలేని దయనీయ స్థితిలో అధికార యంత్రాంగం వుందా.? అన్న అనుమానం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....