Switch to English

బీజేపీ, వైసీపీ.. అలా పంచుకుంటున్నాయ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసే క్రమంలో భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కలిసి కట్టుగా ఖచ్చితమైన ప్లానింగ్‌తో ముందుకు నడుస్తున్నాయి. పార్టీలో ముఖ్య నేతల్ని లాగేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంటే, ఇంకోపక్క గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిని తవ్వి తీయడం ద్వారా చంద్రబాబు మానసిక స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

ఢిల్లీలోనే కాదు, గల్లీల్లోనూ వైసీపీ – బీజేపీ నేతలు కలిసికట్టుగానే కనిపిస్తున్నారు. పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకు నడుస్తున్నారు. అక్రమ కట్టడమంటూ ప్రజా వేదికను కూలగొట్టేసిన ప్రభుత్వం, దానికి కొనసాగింపుగా ఇప్పటివరకూ మరో కూల్చివేత కార్యక్రమం చేపట్టకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అన్నది ఇప్పుడు సామాన్యుల నుంచి వస్తోన్న ప్రశ్న. ‘ప్రజా వేదికతోపాటుగా చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేయాల్సిందే..’ అంటూ వైసీపీ మాత్రమే కాదు, బీజేపీ కూడా చెబుతోంది. చెప్పడం సరే, చిత్తశుద్ధి వుంటే ఆ ప్రక్రియ కూడా ముందుకు నడవాలి కదా.!

నోటీసులు జారీ చేస్తాం.. అని వైసీపీ ఇప్పుడు కథలు చెబుతోందిగానీ, అలా నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చాలన్న ఇంగితం వుంటే.. ఓ నెలో, రెండు నెలలో సమయం తీసుకున్న తర్వాత కదా, ప్రజా వేదికను కూల్చాల్సింది.? ఇదీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్తశుద్ధి అక్రమ నిర్మాణాల కూల్చి వేతకు సంబంధించి. వైఎస్‌ హయాంలో జరిగిన అవినీతిని ఆ తర్వాతి ప్రభుత్వం తవ్వి తీస్తే, ఆ కథ వేరేలా వుండేది.

అంతెందుకు, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీదనే అక్రమాస్తుల కేసు ఇంకా నడుస్తోంది. జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి కూడా ఈ కేసుల్లో ఇప్పటికీ నిందితుడిగానే వున్నారు. వైసీపీ సంగతి ఇలా వుంచితే, పోలవరం ప్రాజెక్టు అంచనాల విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. చంద్రబాబు పాలనని ప్రభుత్వ స్థాయిలో సమర్థిస్తూ, పార్టీ స్థాయిలో వ్యతిరేకిస్తూ కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

టీడీపీని నీర్వీర్యం చేసే విషయంలో మాత్రం బీజేపీకి రెండో ఆలోచన కన్పించడంలేదు. ఎంపీలను (నలుగురు రాజ్యసభ సభ్యులను )లాగేసిన బీజేపీ, ఎమ్మెల్యేల మీద కన్నేసిందిప్పుడు. ఎమ్మెల్యేలను లాగెయ్యాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ మద్దతు బీజేపీకి అవసరం. ఇప్పటికే ఆ దిశగా బీజేపీ – వైసీపీ మధ్య చర్చలకు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరి, స్పీకర్‌ తమ్మినేని శ్రీనివాస్‌.. ఈ పార్టీ ఫిరాయింపులపై ఏం చేస్తారు? వేచి చూడాలిక.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...