ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకీ సమ దూరం పాటిస్తామని బీజేపీ – జనసేన కూటమి చెబుతోంది. కానీ, భారతీయ జనతా పార్టీని ‘పూర్తి స్థాయిలో’ విశ్వసించలేని పరిస్థితి జనసేన పార్టీది. గ్రౌండ్ లెవల్లో జనసేన – బీజేపీ కార్యకర్తలు ‘కలిసి పనిచేయలేని’ పరిస్థితులున్నాయి. దానిక్కారణం భారతీయ జనతా పార్టీనే. బీజేపీకి చెందిన కింది స్థాయి నేతల్లో కొందరు వైసీపీతో అంటకాగుతున్నారు. వైసీపీతోనే కాదు, టీడీపీతోనూ అంటకాగే బీజేపీ నేతలున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ బీజేపీకి చెందిన ముఖ్య నేతలే పరోక్షంగా అంగీకరించాల్సిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవల్లో ప్రజా సమస్యలకు సంబంధించి ఎలా స్పందించాలన్నదానిపై జనసేన శ్రేణుల్లో గందరగోళం కన్పిస్తోంది. విజయదశమి నుంచి బీజేపీ – జనసేన సంయుక్త కార్యాచరణ షురూ చేస్తామనీ, వైసీపీ మీద.. అలాగే టీడీపీ మీద తమ పోరాటం వుంటుందనీ తాజాగా జనసేన పార్టీ ప్రకటించింది. బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు. అయితే, చంద్రబాబుని విమర్శించే క్రమంలో బీజేపీలోని ప్రో-వైసీపీ నేతలు, వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. టీడీపీ ప్రో బీజేపీ నేతల పరిస్థితీ ఇంతే. ఇప్పటికే పలుమార్లు ఈ విషయమై జనసేన – బీజేపీ మధ్య చర్చలు జరిగాయి కూడా. రాజధాని అమరావతి సహా చాలా విషయాల్లో బీజేపీ వైఖరికీ, జనసేన వైఖరికీ మధ్య చిన్నపాటి అభిప్రాయ బేధాలు కన్పిస్తున్న విషయం విదితమే. వాటిని పరిష్కరించుకుని, ఒకే తాటిపై రెండు పార్టీలూ నడవడానికి బీజేపీ నేతలు సహకరించడంలేదన్న వాదనలూ లేకపోలేదు.
ఈ కారణంగానే జనసేన పార్టీ, సొంతంగా ప్రజా సమస్యలపై ఇంకాస్త గట్టిగా అధికార వైసీపీని నిలదీయలేకపోతోంది. అదే సమయంలో, అమరావతి సహా చాలా విషయాలపై జనసేన పార్టీలో నెలకొన్న గందరగోళానికి బీజేపీ రెండు నాల్కల ధోరణే కారణం. విజయదశమిని డెడ్లైన్గా పెట్టుకున్న దరిమిలా, ఈలోగా.. ఈ రెండు పార్టీల మధ్యా చర్చలు ఫలించి, రెండు పార్టీలూ ఒకే తాటిపై నడుస్తాయేమో చూడాలి.
39097 834073Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You obviously know what youre talking about, why throw away your intelligence on just posting videos to your blog when you could be giving us something enlightening to read? 160969