Switch to English

బర్త్‌డే స్పెషల్‌: టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ బుట్టబొమ్మ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఒక్కో టైంలో ఒకొక్కరి టైం నడుస్తు ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో హీరోయిన్‌ పూజా హెగ్డే టైం నడుస్తోంది అనడంలో సందేహం లేదు. ఆమె ప్రభాస్‌ నుండి అఖిల్‌ వరకు ప్రస్తుతం ఆమె మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. ఒక వైపు ప్రభాస్‌ తో రాధేశ్యామ్‌ సినిమా చేస్తున్న ఆ అమ్మడు మరో వైపు అఖిల్‌ అక్కినేనితో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఈ ఏడాది ఆరంభంలో అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న పూజా హెగ్డే ఈ విపత్తు సమయంలో కూడా తన పారితోషికంను దాదాపుగా 75 శాతం పెంచిందట. ఈ విషయం టాలీవుడ్‌ లో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అల వైకుంఠపురంలో తో వచ్చిన సక్సెస్‌ ను ఆమె క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఆమెకున్న క్రేజ్‌ నేపథ్యంలో పారితోషికం ఇష్యూ కాదంటూ ఆమె అడిగిన మొత్తంను ఇచ్చేసి మరో రెండు మూడు సినిమాలకు నిర్మాతలు ఆమెను కన్ఫర్మ్‌ చేసుకున్నారు. వచ్చే ఏడాదిలో ఆ సినిమాలు పట్టాలెక్కబోతున్నాయి.

ప్రభాస్‌ రాధేశ్యామ్‌ సినిమా తర్వాత ఖచ్చితంగా పూజా హెగ్డే బాలీవుడ్‌ లో కూడా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఒక లైలా కోసం.. ముకుందా సినిమాలతో సినీ కెరీర్‌ ను ఆరంభించిన పూజా హెగ్డే ఆ తర్వాత బాలీవుడ్‌ భారీ సినిమా మొహెంజదారో కోసం టాలీవుడ్‌ కు దాదాపుగా రెండేళ్లు గ్యాప్‌ తీసుకుంది.

2017లో అల్లు అర్జున్‌.. హరీష్‌ శంకర్‌ ల కాంబినేషన్‌ లో వచ్చిన ‘డీజే’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో రెచ్చి పోయిన పూజా హెగ్డే యాక్టింగ్‌ మరియు స్కిన్‌ షో విషయంలో కొత్తగా కనిపించింది. మొదటి రెండు తెలుగు సినిమాలతో పోల్చితే పూర్తి విభిన్నంగా పూజాను డీజేలో చూపించారు. ఆ సినిమాతో ఒక్కసారిగా పూజా హెగ్డే బ్యాక్‌ అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ అమ్మడు మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ తెలుగులో అనడంలో సందేహం లేదు.

గత ఏడాది హౌస్‌ ఫుల్‌ 4 సినిమాతో మళ్లీ ఉత్తరాది ప్రేక్షకుల వద్దకు వెళ్లింది. కాని అక్కడ నుండి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. రాధేశ్యామ్‌ సినిమా తర్వాత హిందీ నుండి పిలిచి మరీ ఆఫర్లు ఈమెకు ఇస్తారనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఈ అమ్మడు స్టార్‌ హీరోలతో వరుసగా నటించేందుకు కమిట్‌ అవుతోంది. ఇదే సమయంలో తమిళం నుండి కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక స్టార్‌ హీరో మూవీతో ఈ అమ్మడు కోలీవుడ్‌ ఎంట్రీ కోసం వెయిట్‌ చేస్తోంది.

మొత్తానికి అన్ని భాషల్లో కూడా తన సత్తా చాటేందుకు గాను ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది. తమిళంలో 2012లోనే ఈమె ఒక సినిమాను చేసింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు ఒక స్టార్‌ హీరో సినిమా కోసం వెయిట్ చేస్తుంది. సౌత్‌ ఇండియాతో పాటు నార్త్‌ లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఈ బుట్టబొమ్మ పుట్టిన రోజు నేడు.

ఈ సందర్బంగా ఆమెకు మా తరపున ఆమె అభిమానుల తరపున మరియు ఇండస్ట్రీ తరపున హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరిన్ని మంచి సినిమాలను పూజా అందించాలని కోరుకుంటున్నాం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...