Bigg Boss Telugu7: బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్ ఒకింత ఇంట్రెస్టింగ్గానే సాగుతోంది. హౌస్లో ఎవరూ ఇంతవరకూ హౌస్ మేట్స్ కాదనీ, అందరూ ప్రస్తుతానికి కంటెస్టెంట్స్ మాత్రమేనని ఈ సీజన్ని ఒకింత కొత్తగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికైతే, అటు గ్లామర్ పరంగా.. ఇటు ఎంటర్టైన్మెంట్ పరంగా రితికా రోజ్ గురించిన టాక్ గట్టిగా వినిపిస్తోంది.
అందుకేనేమో, రితికని బిగ్ బాస్ టార్గెట్ చేసినట్లున్నాడు. తనను మెప్పించేలా కంటెస్టెంట్లకు రకరకాల టాస్క్లు ఇచ్చాడు బిగ్ బాస్. తాజా టాస్క్ నేపథ్యంలో అటు శివాజీ, ఇటు రితిక.. ఈ ఇద్దరూ మిగతా హౌస్ మేట్స్కి టార్గెట్ అయిపోయారు. మొత్తం నలుగురు రేసులో నిలిచారు.
మిగిలిన ఇద్దరిలో ఒకరు ప్రియాంక, ఇంకొకరు సందీప్. అయినాగానీ, హౌస్ మేట్స్ అంతా కూడబలుక్కుని, రితికని టార్గెట్ చేశారు. రితిక తర్వాత ఎక్కువమంది శివాజీని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో రితిక ఎమోషనల్గా డౌన్ అయ్యింది. ఇంకోపక్క, పాత్రలు క్లీన్ చేసే విషయమై ప్రియాంక గుస్సా అయితే, ఆమెతో దామిని పంచాయితీ పెట్టుకుంది.
షకీలా, కిరణ్ రాథోడ్.. రితికకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం గమనార్హమిక్కడ. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాంటూ కిరణ్ రాథోడ్ ముద్దు ముద్గుగా చెప్పుకొచ్చింది. కాగా, బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ నేపథ్యంలో బాత్రూమ్లోకి వెళ్ళి విడివిగా దాక్కున్నారు రితిక, శివాజీ.
అలా దాక్కోవడం సహా అనేక అంశాలు, ఈ ఇద్దరూ మిగతా హౌస్ మేట్స్కి టార్గెట్ అయ్యారు. అదొక్కటే కాదు, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కోణంలోనూ వీరిని మిగతా కంటెస్టెంట్స్ టార్గెట్ చేస్తుండడం గమనార్హం. రెండు మూడు రోజులు ఆగితే అసలు సిసలు ఆట ఏంటో చూస్తారంటూ రితిక, హౌస్ మేట్స్ని ఉద్దేశించి సవాల్ విసిరింది.
బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్లో భాగంగా దామిని, కిరణ్ రాథోడ్.. ఐదేసి గుడ్లను ఇతర కంటెస్టెంట్ల నెత్తి మీద పగలగొట్టి, వాటిని ఆమ్లెట్లుగా వేయాల్సి వుంటుంది. ఈ టాస్క్లో కిరణ్ రాథోడ్ గెలిచింది. నీట్గా డ్రెస్ అయిన శుభశ్రీ అలాగే, బాత్రూమ్లో దాక్కున్న పల్లవి ప్రశాంత్లను పూల్లో దూకమని బిగ్ బాస్ ఆదేశించాడు.
ఈ రోజు ఎపిసోడ్లో ఇవే ముఖ్యాంశాలు. గత సీజన్ చాలా డల్లుగా సాగితే, ఈ సీజన్ కొంత ఆసక్తికరంగానే సాగుతోంది.