‘నువ్వు బాధపడి వుంటే క్షమాపణ చెబుతున్నా..’ అంటూ రతిక రోజ్ మీద కొంత అసహనం వ్యక్తం చేశాడు శివాజీ.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఏడో సీజన్లో ‘పెద్దన్న’ తరహా పాత్రలో కనిపిస్తున్నాడు శివాజీ. శివాజీ నాటకీయత.. అందరికీ అర్థమవుతోంది. హౌస్లో అందరికీ అతనే పెద్దన్నలా వ్యవహరిస్తున్నాడు, తెరవెనుకాల నడపాల్సిన కథలు నడిపేస్తున్నాడు కూడా.
వీకెండ్ ఎపిసోడ్ సందర్భంగా, నాగార్జునతో మిగతా కంటెస్టెంట్లను ఉద్దేశించి కలుపు మొక్కలని శివాజీ వ్యాఖ్యానించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇదే విషయమై క్లారిటీ కోసం శివాజీని రతిక నిలదీసింది. దాంతో, శివాజీ అసహనానికి గురయ్యాడు. వివరణ ఇవ్వాల్సింది పోయి, క్షమాపణతో సరిపెట్టేశాడు.
ఇక, నామినేషన్స్ సందర్భంగా కంటెస్టెంట్లు, కోర్టు తరహా సెటప్లో తమ ఆరోపణలు చేస్తోంటే, బోనులో నిల్చుని.. నామినేషన్స్ ఎదుర్కొంటున్నవారు.. తమ వివరణలు ఇచ్చుకుంటున్నారు. శివాజీతోపాటు సందీప్, శోభా శెట్టి జ్యూరీ సభ్యులట.
జ్యూరీ అంటే ఎలా వుండాలి.? తమకు నచ్చిన తీర్పులు ఇచ్చేస్తారా.? పైగా, కంటెస్టెంట్లు చెప్పే ఆరోపణల్లో అర్థం లేదని కొట్టి పారేస్తారా.? ఇదెక్కడి పంచాయితీ.? బిగ్ బాస్ కూడా, జ్యూరీకి క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. జ్యూరీ సభ్యులు, ఎవరు నామినేషన్స్లో వుండాలని తేల్చేస్తే, ఇక కంటెస్టెంట్ల మధ్య నామినేషన్ ఎపిసోడ్ ఎందుకు.?
జ్యూరీ సభ్యుల్లో.. ముగ్గురూ ముగ్గురే.! ఆయా జ్యూరీ సభ్యులకు నచ్చని కంటెస్టెంట్లను, అసలు వాదనలతో సంబంధం లేకుండా, బోర్డు మీదకు ఎక్కించేశారు.. నామినేట్ చేసేశారు. ఈ విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది సోషల్ మీడియాలో.
నిజానికి, ఈసారి బిగ్ బాస్ టేకాఫ్ బాగానే వుంది. ఆ తర్వాతే అసలు ఛండాలం మొదలైంది. శివాజీని నాగ్ ఎందుకు ప్రోత్సహిస్తున్నట్టోగానీ.. హౌస్లో వాతావరణం, శివాజీతోపాటు మిగతా ఇద్దరు జ్యూరీ సభ్యుల వల్లనే చెడిపోతోందన్నది నిర్వివాదాంశం.
Heya i am for the first time here. I came across this board and I find It really
useful & it helped me out a lot. I’m hoping to give one thing
again and help others such as you helped me.