బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు బెయిల్ మంజూరైంది. సెషన్స్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా 10 వేల పూచీకత్తు ఇస్తూ ఇద్దరి హామీ సంతకాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 17 రోజులుగా అఖిల ప్రియ చంచల్ గూడ జైల్లో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె విడుదలకు మార్గం సుగమమైంది.
అయితే.. అఖిలప్రియ భర్త దాఖలు చేసుకున్న బెయిల్ ను సికింద్రాబాద్ కొట్టేసింది. కిడ్నాప్ జరిగిన రోజు నుంచి భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో భార్గవ్ రామ్ ఏ3 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో భార్గవ్ రామ్ పట్టుబడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందుకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అఖిల ప్రియ రేపు విడుదలయ్యే అవకాశం ఉంది.
703487 836858I actually enjoyed reading this website, this is excellent blog. 514970