అదేంటి.. ప్రధాని నరేంద్ర మోదీపై కోపం టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి శాపం ఎలా అయిందంటారా? అసలు ఏ విషయంలో ఇలా జరిగిందనేగా మీ డౌట్? ప్రపంచంలో అత్యుత్తమ క్రికెట్ జట్టు సారథి ఎవరనే విషయం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆన్ లైన్ లో పోల్ నిర్వహించింది. ఇందులో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డీవిలియర్స్, న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు సారథి పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు.
దాదాపు 5 లక్షల ఓట్లు పోలైన తర్వాత ఐసీసీ ఆ ఫలితాలను వెల్లడించింది. ఇందులో కోహ్లీకి 46.2 శాతం ఓట్లు రాగా, ఇమ్రాన్ ఖాన్ కు 47.3 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ విషయమే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కోహ్లీ కంటే ఎప్పుడో పాక్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన ఇమ్రాన్ కు అన్ని ఓట్లు ఎలా పడ్డాయి అని ఆశ్చర్యపోయారు.
ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. భారత్ కు చెందిన పలువురు ఇమ్రాన్ కు ఓటేయడమే ఇందుకు కారణమని తేలింది. తమకు ప్రధాని మోదీ అంటే ఇష్టం లేదని.. అందుకే తాము ఇమ్రాన్ కు ఓటేశామని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. కాంగ్రెస్, ఆప్ ఆధ్వర్యంలో నిర్వహించే ఐటీ టీం కూడా ఈ విషయంలో ఇమ్రాన్ కు అనుకూలంగా పనిచేసినట్టు వార్తలొచ్చాయి. కానీ వాటిని ఆ టీం ఖండించింది.
439587 163704Some actually quality posts on this web site , saved to favorites . 249210
110330 840428This website is actually a walk-through it really will be the details you wanted concerning this and didnt know who to inquire about. Glimpse here, and youll completely discover it. 372951
746519 996479I believe other site owners need to take this web site as an example , really clean and great user genial style . 24085