‘‘నారా చంద్రబాబునాయుడుగారూ.. మాకు ప్రభుత్వం ఇవ్వదలచుకున్న పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దు..’’ అంటూ కొందరు వైసీపీ మద్దతుదారులు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేతకు లేఖలు రాయిస్తున్నారు. ‘టీడీపీనే ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమానికి అడ్డు తగులుతోంది..’ అంటూ వైసీపీ పదే పదే ఆరోపిస్తోన్న విషయం విదితమే. కానీ, అసలు విషయం వేరు.
మార్చి నెలాఖరున ఇవ్వాల్సిన ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమం స్థానిక ఎన్నికలు, కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడ్డాయి. నిజానికి, రాష్ట్రంలో చాలా చోట్ల ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ, సేకరణ.. రసాబాసగా మారిన విషయం విదితమే. చాలా చోట్ల వివాదాలు తలెత్తుతున్నా, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. ఇదీ అసలు సమస్య.
భూమి అంటేనే వివాదం.. అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి ఇటీవలి కాలంలో. అమరావతి విషయంలో ఏం జరిగిందో చూశాం. అలాంటిది, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలు.. పేదల కోసం సేకరించడమంటే చిన్న విషయం కాదు కదా.! మరి, సమస్య ఇంత పెద్దదైనప్పుడు.. సరైన ‘గ్రౌండ్ వర్క్’ చేయకుండా ఇళ్ళ స్థలాల పంపిణీకి ముహార్తాలు నిర్ణయించేయడం ప్రభుత్వం వైఫల్యంగానే అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరోపక్క, చంద్రబాబు హయాంలో నిర్మించిన అపార్ట్మెంట్లు, ఇళ్ళున్నాయి. వాటిల్లో కొన్ని లబ్దిదారులకు గతంలోనే కేటాయింపబడ్డా, లబ్దిదారులకు వాటిని ఇంకా ఇవ్వలేదు. భూముల వ్యవహారం వివాదాల్లో వున్నప్పుడు, కట్టిన ఇళ్ళను అయినా లబ్దిదారులకు ఇచ్చేయాలి కదా.! ఇదే ప్రశ్న న్యాయస్థానం నుంచి తాజాగా ప్రభుత్వానికి ఎదురయ్యింది.
‘గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది..’ అంటూ అధికార పార్టీ నేతలు, మీడియాకెక్కి నానా రచ్చా చేస్తున్నారు.. ‘కట్టిన ఇళ్ళను పేదలకు ఎందుకు ఇవ్వడంలేదు’ అని ప్రశ్నిస్తే.! అదే సమాధానం న్యాయస్థానాల దగ్గర చెబితే కుదరదు కదా.! పోనీ, వివాదాల్లేని భూముల్లో ఇళ్ళ పట్టాల పంపిణీకి శ్రీకారం చుడితే బావుండేది కదా.? అన్న ప్రశ్నకీ ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం దొరకని పరిస్థితి.
రాజమండ్రి సమీపంలోని ఆవ భూములు కావొచ్చు, మరో జిల్లాలో దళితుల భూములు కావొచ్చు.. ఇంకో చోట ఏళ్ళ తరబడి పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములు కావొచ్చు.. మడ అడవుల పరిధిలోకి వచ్చే బూములు కావొచ్చు. వీటి చుట్టూ వివాదాలుంటాయని తెలిసీ, ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
తాజా డెడ్లైన్ ఆగస్ట్ 15.. ఈలోగా పరిస్థితులు ఏమంత అనుకూలంగా మారేలా కన్పించడంలేదు. మరి, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలోచన ఏంటి.? షరామామూలుగానే విపక్షాలపై బురదచల్లేసి.. ఇంకోసారి ‘వాయిదా’ అంటుందేమో.!
131260 497198Someone necessarily assist to make critically articles Id state. This is the initial time I frequented your internet page and thus far? I amazed with the analysis you created to make this actual submit incredible. Exceptional activity! 456115
525570 252360I like this post, enjoyed this one appreciate it for putting up. 991214
432575 670009I totally agree! I came more than from google and am searching to subscribe. Exactly where is your RSS feed? 243463