తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో వున్న చంద్రబాబుపై దుండగులు రాళ్ళ దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తకు గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే, చంద్రబాబు ప్రచార వాహనం దిగి, కార్యకర్తక తగిలిన గాయంపై వాకబు చేశారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనీ, వైసీపీ గూండాలు తమ ఎన్నికల ప్రచారంపై దాడి చేయడం దుర్మార్గమని చంద్రబాబు విమర్శించారు.
దాడికి నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర అలజడి రేగింది. తన సొంత జిల్లాలోనే తన మీద దాడి చేసే ధైర్యం దుండగులకు ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. దాడికి దుండగులు ముందస్తు వ్యూహం రచించుకున్నారనీ, ప్రతిపక్ష నేత నిర్వహిస్తోన్న ఎన్నికల ప్రచార సభకు ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు.
‘చరిత్ర హీనుడిగా మిగలిపోవద్దని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూచిస్తున్నా.. ప్రజాస్వామ్యంలో దాడులకు అవకాశమే వుండకూడదు..’ అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. మరోపక్క, ఇదంతా పబ్లిసిటీ స్టంట్.. అని వైసీపీ శ్రేణులు కొట్టి పారేస్తున్నాయి. సింపతీ కోసమే చంద్రబాబు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారన్న విమర్శలు అధికార పార్టీ నుంచి దూసుకొస్తున్నాయి.
‘చంద్రబాబు డ్రామాలాడుతున్నారంటోన్న వైసీపీ, గతంలో వైఎస్ జగన్ మీద జరిగిన హత్యాయత్నాన్ని కూడా డ్రామాగానే అంగీకరిస్తుందా.?’ అంటూ టీడీపీ శ్రేణులు ఎదురుదాడికి దిగుతున్నాయి. ఏదిఏమైనా, ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా వైఎస్ జగన్ ప్రభుత్వం మీదనే వుంటుంది. చంద్రబాబు ఎన్నికల ప్రచార వాహనంపై రాళ్ళ దాడికి యత్నించడమంటే, దీన్ని హత్యాయత్నంగానే భావించాలన్నది టీడీపీ నేతల ఆరోపణ. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత వున్న చంద్రబాబుపై దాడికి యత్నించం నిజంగానే ఆశ్చర్యకరం.
873098 309944Hi. Cool write-up. There is a difficulty with the web website in firefox, and you might want to test this The browser could be the marketplace leader and a huge portion of folks will miss your superb writing due to this issue. 141639