Switch to English

హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. అయినా తీరు మార్చుకోని వైసీపీ ప్రభుత్వం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

న్యాయస్థానం ఏదన్నా విషయమ్మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే.. ఆ విషయమ్మీద ప్రభుత్వం తగిన వివరణ ఇచ్చుకోవాలి.. తీర్పు నచ్చకపోతే, పై కోర్టుని ఆశ్రయించే అవకాశమూ ప్రభుత్వానికి వుంటుంది. అంతే తప్ప, హైకోర్టు ఆదేశాల్ని పెడచెవిన పెట్టి, అడ్డగోలుగా వ్యవహరించడమంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? న్యాయ కోవిదులు ఈ తరహా వ్యవహారాల్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. కోర్టు ధిక్కరణ.. అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికీ పలు విషయాల్లో మొట్టికాయలు పడుతున్నాయి న్యాయస్థానాల నుంచి. కానీ, అక్కడి పరిస్థితులు వేరు. ప్రభుత్వంలో వున్నవారు మొండికేయడంలేదక్కడ. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అలా కాదు.. న్యాయస్థానాలపైనే అధికారపార్టీ నేతలు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.

తాజాగా, రైతు భరోసా కేంద్రం నిర్మాణంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది ప్రభుత్వ తీరుకి సంబంధించి. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం తిరుమలాపల్లి గ్రామంలో తొలుత గ్రామ సచివాలయ నిర్మాణం కోసం ప్రయత్నించింది ప్రభుత్వం. అయితే, మామిడి తోపు, బండి దారి ప్రాంతంలో గ్రామ సచివాలయాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో, హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు ఇచ్చింది.

దాంతో, అధికారులు మరింత అత్యుత్సాహం చూపారు. హైకోర్టు ఆదేశాల్ని పక్కన పెట్టి, అక్కడ రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘ఓ సారి స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇచ్చాక, అదే స్థలంలో మరో పథకం పేరు చెప్పి నిర్మాణం చేస్తారా.?’ అంటూ మండిపడింది. నిజానికి, ప్రభుత్వం ఈ తరహా దుందుడుకు చర్యలకు దిగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల విషయమై ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపి.. చివరికి మరింత ఘాటుగా మొట్టికాయలు పడేసరికి, వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

ఇదంతా అధికారుల అత్యుత్సాహమా.? ప్రభుత్వ పెద్దల పైత్యమా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రతిసారీ తప్పు చేస్తూ, అడ్డంగా దొరికిపోతూ.. ‘న్యాయస్థానాలు మమ్మల్ని పరిపాలన చేయనివ్వట్లేదు.. మాది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం..’ అంటూ అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానించడమంటే, ఇదేదో పద్ధతి ప్రకారం న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడి అని ఎందుకు అనుకోకూడదన్నది రాజకీయ విశ్లేషకుల, న్యాయ కోవిదుల ప్రశ్న.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...