ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం హైకోర్టుకు చేరింది. ఈక్రమంలో ప్లాంట్ ప్రైవేటీకరణ పిటిషన్పై కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఫిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
జేడీ తరపున లాయర్లు అదినారాయణ, బాలాజీ వదేరా వాదనలు వినిపించారు. అయితే.. ప్రైవేటీకరణపై నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోరామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. పిటిషన్ పై తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఈ అంశంపై కొన్ని రోజులుగా విశాఖలో కార్మికులు ఆందోళనలు, దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటీకరణ చేయొద్దని.. ప్రత్యామ్నాయాలు చూడాలని సీఎం జగన్ కూడా కేంద్రానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మాజీ జేడీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
38850 350316I appreciate your function , thanks for all of the informative blog posts. 207824
518451 482030Perfectly written topic material , thanks for selective details . 624001
114221 477463I do not have a bank account how can I spot the order? 2524