ఇది నిజంగానే సరికొత్త ట్రెండ్. జగనన్నా మజాకానా.! రాజకీయ విమర్శలకు రాజకీయ పార్టీలు సమాధానమిచ్చే తరహాలో పత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలు దర్శనమిచ్చాయి.. అదీ ఇసుక గురించి కావడం గమనార్హం. ‘అయినా, ఇసుక అమ్ముకోవడమేంట్రా.. కలికాలం కాకపోతే.!’ అని చాలామంది అనుకోవచ్చుగాక.. కానీ, ఇది కలి కాలం.. కాదు కాదు, ఇసుకాసురులు రాజ్యమేలుతున్న కాలం.
ఔను, ఇసుకే బంగారం. కాదు కాదు, బంగారం వర్తకులూ నష్టాల్లో కూరుకుపోతున్నారుగానీ, ఇసుక వ్యాపారులు కోట్లు గడించేస్తున్నారు.. పైగా, ఆ ఇసుకని నమ్మకునే చాలామంది రాజకీయాల్లో ఎదురుగుతున్నారు. ఏడాదికి 750 కోట్ల రూపాయల ఆదాయమే లక్షంగా ప్రభుత్వం, ఇసుకను ప్రైవేటుకి అప్పగించేసింది. ప్రైవేటు సంస్థ ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఏడాదికి 950 కోట్లు మాత్రమే కాంట్రాక్టు సంస్థకు వస్తాయంటూ కాకి లెక్కలూ చెప్పింది ప్రకటన ద్వారా.
ప్రభుత్వానికి 750 కోట్లు ఇచ్చేయగా, మిగిలిన 200 కోట్లు.. నిర్వహణ తదితరాలు వుంటాయట.. పాపం ప్రైవేటు సంస్థ ‘జేపీ’ ఎంత మానవతా దృక్పథంతో ఈ బిడ్డింగ్లో పాల్గొన్నదో కదా.! సాధారణ వ్యాపారాల్నే తీసుకుంటే, ఆర్నెళ్ళలోపే పెట్టుబడికి రెండింతలు లాభాలు వచ్చేయాలని చూడటం సర్వసాధారణమే. అలాంటిది పెద్ద పెద్ద కాంట్రాక్టుల విషయంలో ఏం జరుగుతుంది.? కాంట్రాక్టర్ల ఆలోచనలు ఎలా వుంటాయి.? రాజకీయ నాయకులే ప్రముఖ కాంట్రాక్టర్లు గనుక.. ప్రభుత్వంలో వున్నవారికి ఈ లెక్కలు తెలియవని ఎలా అనుకోగలం.?
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ‘ఇసుక చుట్టూ’ రాజకీయం ఆంధ్రపదేశ్లో జరుగుతోంది. ఇసుక దోపిడీ అనేది అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతోంది. ఆంధ్రపదేశ్లో అది మరింత ఎక్కువ.. అంతే తేడా. పైగా, రాష్ట్రంలో ఇసుక దొరకడమే గగనమైపోయింది. కొత్త ఇసుక విధానం.. అంటూ ఎన్నెన్ని మార్పులు చేస్తున్నా ప్రభుత్వం అభాసుపాలవుతూనే వుంది.
ఇది చాలక, మళ్ళీ ప్రకటనల ఖర్చు దండగ ఒకటి. అంతా ప్రజాధనమే కదా.. పైగా, ఈ ప్రభుత్వ ప్రకటనలు అధికార పార్టీకి చెందిన అనుకూల మీడియాకి ‘స్పెషల్ కేటగిరీ’ కింద దక్కుతున్నాయన్న విమర్శలూ లేకపోలేదు. అందుకే, ఆ పత్రికల్లో వచ్చే సాధారణ వార్తల తరహాలోకి మారిపోయాయి ప్రభుత్వ ప్రకటనలు.
219458 634085Were glad to become visitor on this pure web site, regards in this rare information! 784732
330523 20147Some genuinely good and utilitarian information on this internet site, as well I believe the style has got great functions. 246135