స్వీటీ అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాల విషయంలో ఎక్కడా తొందర పడట్లేదు. ఏడాదికి ఒక సినిమా అన్నట్లుగా చేసుకుంటూ వస్తోంది. బాహుబలి తర్వాత భాగమతి చేసిన అనుష్క రెండేళ్ల విరామం తర్వాత నిశ్శబ్దం చిత్రాన్ని చేసింది. ఈ సినిమా మాములుగా అయితే ఈ పాటికి విడుదలవ్వాలి కానీ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఓటిటి ద్వారా ఈ చిత్రం విడుదలవుతుంది అని అన్నారు కానీ చిత్ర యూనిట్ అటువంటిది ఏం లేదని క్లారిటీ ఇచ్చింది. కచ్చితంగా థియేటర్లోనే సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.
ఆగష్టు లేదా సెప్టెంబర్ నుండి థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశముంది. అప్పుడు నిశ్శబ్దం రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. నిశ్శబ్దం తర్వాత అనుష్క ఇంకా కొత్త ఏదీ ఒప్పుకోలేదు. అయితే ప్రస్తుతం ఒక సినిమాను ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే అనుష్క పెద్ద పీట వేస్తోందన్న విషయం తెలుస్తోంది.
భాగమతి, నిశ్శబ్దం తర్వాతి సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే చేయనుంది. తనతో భాగమతి చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలోనే అనుష్క తర్వాత చిత్రాన్ని చేయనుంది. ఆ సినిమాకు రా రా కృష్ణయ్య ఫేమ్ పి. మహేష్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.
992867 352053I enjoy the appear of your site. I lately built mine and I was looking for some design tips and you gave me a couple of. May possibly I ask you whether you developed the site by youself? 968903
15457 440016I admire the helpful facts you offer inside your articles. I will bookmark your weblog and also have my children verify up here often. Im really certain theyll learn lots of new issues appropriate here than anybody else! 895833
662680 630664Hiya! Fantastic blog! I happen to be a every day visitor to your website (somewhat much more like addict ) of this site. Just wanted to say I appreciate your blogs and am searching forward for a lot more! 545137