Switch to English

పేదల కడుపుపై దెబ్బ.. అన్న క్యాంటీన్ల మూసివేత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ సీపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లను మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేసింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు పనిచేయవు. పేదలకు రూ.5కే భోజనం పెడుతున్న ఈ క్యాంటీన్లను ఇలా అర్థంతరంగా మూసివేయాలన్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి.

సాధారణంగా ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను కొత్త సర్కారు కొనసాగించేందుకు ఇష్టపడదు. ఇదే తరహాలో గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను జగన్ సర్కారు ఒక్కోదాన్నీ తొలగిస్తూ వస్తోంది. తాజాగా అన్న క్యాంటీన్లను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. తమిళనాడు దివంగత సీఎం జయలలిత ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లను స్ఫూర్తిగా తీసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో ఈ పథకం ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే పేదలకు భోజనం పెడతామని ప్రకటించారు. అయితే, అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత 2018లో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. 13 జిల్లాల్లో మొత్తం 204 క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చడానికి శ్రీకారం చుట్టారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలను ఒక్కొక్కటి రూ.5కే అందజేయాలన్నది వీటి ఉద్దేశం. ఒక్కో క్యాంటీన్ భవనాన్ని రూ.35 లక్షల వ్యయంతో నిర్మించగా.. భోజన ఏర్పాట్ల బాధ్యతను అక్షయపాత్ర అనే సంస్థకు అప్పగించారు.

వీరు భోజనానికి రూ.5 చొప్పున వసూలు చేసుకోగా.. ప్రభుత్వం ఉదయం అల్పాహారం, రెండు పూటలా భోజనానికి కలిపి రూ.58 చెల్లిస్తుంది. ఒక్కో క్యాంటీన్లో రోజుకు మూడు పూటలా వెయ్యి నుంచి 1200 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను క్రమంగా ఎత్తివేయాలని నిర్ణయించింది. తొలుత 1200 నుంచి 800 మందికి అనంతరం 600 మందికి కుదించింది. తాజాగా జూలై 31తో మొత్తం మూసివేయాలని ఆదేశాలిచ్చింది.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం కొనసాగించడం ఇష్టం లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే దీనిని మూసివేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న క్యాంటీన్ ద్వారా తాము పేదలకు భోజనం అందజేస్తామని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతున్నా.. వాటిని ప్రారంభించకుండా పాతవాటిని మూసివేయడం సబబు కాదని అంటున్నారు. పేదల కడుపుపై దెబ్బ కొట్టొద్దని కోరుతున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...