ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మరోమారు నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాష్ట్రాల మధ్య ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’కి సంబంధించి ఆరోగ్యకరమైన పోటీ వుందనీ, ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేంద్రం చెబుతోంది. ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం. అయితే, ఈ ఘనత ఏ ఏడాదికి సంబంధించినది.? అన్నదానిపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. టీడీపీ, ఈ ఘనతను తమ ఖాతాలో వేసేసుకుంది. 2019 మార్చి 31 వరకు తీసిన లెక్కల ప్రకారం.. అంటోంది టీడీపీ. అబ్బే, వైఎస్ జగన్ కష్టానికి తగిన గుర్తింపు దక్కిందని వైసీపీ చెబుతోంది.
నిజానికి, ఈ వివరాలు గత మార్చిలోనే వెల్లడి కావాల్సి వున్నా, కరోనా నేపథ్యంలో వాయిదా వేశారట. టీడీపీ అనుకూల మీడియా, వైసీపీ అనుకూల మీడియా తమకు తోచిన విధంగా ఈ ఘనతల్ని చంద్రబాబు ఖాతాలోనూ, వైఎస్ జగన్ ఖాతాలోనూ వేసేస్తున్నాయి. రాష్ట్రానికి మంచి ర్యాంకు వచ్చినందున రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేయాల్సిందే. కానీ, గతంలోనూ ఇదే ర్యాంకింగ్ విషయమై వైసీపీ నానా యాగీ చేసింది. ‘అదంతా డొల్ల..’ అని అప్పట్లో చెప్పిన వైసీపీ, ఇప్పుడు ఆ ర్యాంక్ తమ ఘనతగా చెప్పుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే, చంద్రబాబు హయాంలోనూ ర్యాంకులొచ్చాయి.. వైఎస్ జగన్ హయాంలోనూ ర్యాంకులొచ్చాయనే అనుకుందాం.
కానీ, రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందడంలేదు.? అప్పుల్లో రికార్డులు సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్.. అభివృద్ధిలో ఎందుకు వెనకబడిపోతోంది.? ఈ పాపానికి కారణమెవరు.? చంద్రబాబా.? వైఎస్ జగనా.? ఈ విషయమై ఇరు పార్టీలూ చర్చించి ఓ నిర్ణయానికి వస్తే మంచిదేమో.! పొరుగు రాష్ట్రం తెలంగాణకు మూడో స్థానం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో వచ్చినా, అభివృద్ధిలో దూసుకుపోతున్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు గుర్తెరగాలి.
785632 533096Hey very cool website!!Man .. Excellent .. Amazing. 744793
159323 389264I genuinely like forgathering utile information, this post has got me even much more info! . 972655