ఎన్నికల్లో గెలవడానికి పార్టీల అధినేతలు ఒక్కొక్కరూ ఒక్కో రకమైన వ్యూహాన్ని అవలంభిస్తుంటారు. ప్రజలను ఆకట్టుకునే హామీలిస్తారు.. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి జనాలను ఆకర్షిస్తారు. అయితే, ఇటీవల ఎన్నికల్లో హామీల కంటే సెంటెమెంట్ రగిలించడానికే పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మేమొస్తే ఇది చేస్తాం.. అది చేస్తాం అని చెప్పడం కన్నా, వారొస్తే ఏదో జరిగిపోతుందనే భయం జనాల్లోకి ఎక్కించడం మొదలైంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదే అస్త్రంతో దూసుకెళ్లారు. నాలుగున్నరేళ్ల పాలనలో తాను ఏం చేశానో చెప్పడం కన్నా, టీడీపీ అధినేత చంద్రబాబును బూచిగా చూపడానికే ప్రాధాన్యత ఇచ్చారు. మహాకూటమితో చంద్రబాబు చేతులు కలిపిన వెంటనే కేసీఆర్ తన స్వరం మార్చేశారు. కూటమికి ఓట్లేస్తే పరాయి పాలన తెచ్చుకోవడమే అని చెప్పడం ప్రారంభించారు.
ప్రతి సభలోనూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ పరాయి పాలన వచ్చినట్టేనని జనాన్ని భయపెట్టారు. దీంతో ప్రజల్లోనూ ఆందోళన మొదలైంది. బాబు వస్తే మన పని ఏమవుతుందో అనే భయం కదలాడింది. అంతే.. టీఆర్ఎస్ కు భారీ మెజార్టీతో గద్దెనెక్కించారు. ఉద్యమ సమయంలో ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి, ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్.. ఎన్నికల్లోనూ ఆత్మగౌరవ నినాదంతో విజయం సాధించారు.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. ఈ ఐదేళ్లలో తాము చేసింది చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోవడంతో కేసీఆర్ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో తనను ఏ విధంగా బూచిగా కేసీఆర్ చూపించారో.. ఇప్పడు అదే తరహాలో కేసీఆర్ ను బూచిగా చూపించడానికి బాబు ప్రయత్నిస్తున్నారు.
వైఎస్సార్ సీపీ అధినేత జగన్ కు ఓటేస్తే, అది కేసీఆర్ కు వేసినట్టేనని చెబుతున్నారు. ప్రతి సభలోనూ కేసీఆర్ నామస్మరణ చేస్తున్నారు. అయితే, ఇలాంటి సెంటిమెంట్ తెలంగాణలో పనిచేసినట్టుగా ఏపీలో పనిచేస్తుందా అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కులం ప్రభావం అంతగా ఉండదు.
ఉమ్మడి రాష్ట్రంలో తమపై వివక్ష చూపించారనే భావం ప్రజల్లో ఎక్కువగా ఉండటంతో మనపాలన.. మన ఆత్మగౌరవం అనే నినాదం వారిలో బలంగా పాతుకుపోయింది. అందువల్లే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. సరిగ్గా అదే సెంటిమెంట్ ను కేసీఆర్ మళ్లీ ప్రజల్లో రగల్చడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ కులం ప్రభావం చాలా ఎక్కువ.
ఈ నేపథ్యంలో బాబు నమ్ముకున్న కేసీఆర్ వ్యతిరేక అస్త్రం అంతగా పనిచేయడంలేదు. జనాల్లో పెద్దగా స్పందన వ్యక్తంకావడంలేదు. పైగా ఏపీ రాజకీయాలకు, తమకు సంబంధం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పష్టంచేశారు. మరోవైపు ఏపీవాసులు చాలామంది హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉంటున్నారు. వారంతా కేసీఆర్ నాయకత్వానికి మద్దతుగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం.
కేసీఆర్ ఆంధ్రావాళ్లకు వ్యతిరేకి అన్న భావన వారిలో ఎక్కడా లేదు. ఏపీ వాసులు చంద్రబాబు వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణం అదే. మరి ఇప్పటికైనా చంద్రబాబు ఈ విషయాన్ని గ్రహించి, తన వ్యూహాన్ని మార్చుకుంటారో లేక ఇదే ఒరవడిని కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే.
211356 550311Glad to be one of numerous visitors on this awing website : D. 256148
224872 248494There is noticeably plenty of funds to comprehend about this. I assume youve created certain good points in attributes also. 297983
967600 605754Gnarly article mate, maintain the good work, just shared this with ma friendz 242363