Switch to English

విభజించు.. పాలించు.. రాజకీయ రాక్షస క్రీడ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘రాష్ట్ర అభివృద్ధి – రాజధాని’ అంశాలపై జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం కమిటీలు వేయడాన్ని తప్పు పట్టలేం. ఆ కమిటీలు నివేదికలు ఇవ్వడాన్ని తప్పు పట్టలేం. కానీ, ఇలాంటి నివేదికల్లో ప్రాంతాల వారీగా విభజన చేయడమేంటి.? ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు రాష్ట్రంలో వెనకబడి వున్నాయన్నది నిర్వివాదాంశం. కానీ, ఇప్పుడు కొత్తగా మధ్య కోస్తా, దక్షిణ కోస్తా పేర్లు తెరపైకొచ్చాయి. కమిటీ నివేదికలో పంపకాలు జరిగాయి. ని

జానికి.. ఇవన్నీ ఆచరణలోకి వస్తాయా.? అన్నది వేరే చర్చ. కానీ, నివేదిక చూశాక ప్రజల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంతం భగ్గుమంటోంది. రాజధాని కోసం తమ భూములు ఇచ్చిన రైతులు, ఇప్పుడు ప్రభుత్వం తమను సర్వనాశనం చేస్తోందంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.

నిజానికి, కమిటీ నివేదిక చాలా అద్భుతంగా కన్పిస్తోంది. విశాఖలోనూ, కర్నూలులోనూ, అమరావతిలోనూ అభివృద్ధి.. అన్నట్లుగానే కన్పిస్తోంది. అయితే, ఈ కమిటీల్ని ప్రభుత్వాలు ఎంతవరకు గౌరవిస్తాయి.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. రాజధాని విషయమై కేంద్రం గతంలో వేసిన శివరామకృష్ణ కమిటీ ఏమయ్యిందో అందరికీ తెలుసు. అంతకు ముందు, ఉమ్మడి రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏమయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాపు రిజర్వేషన్లపై ఏర్పాటయిన కమిటీ కూడా అంతే.

కమిటీల నివేదికల్ని ప్రభుత్వాలు ఎంతవరకు గౌరవిస్తాయి.? అసలు, ఆ కమిటీల నివేదికల్ని ప్రభుత్వాలు ఎలా పేంపర్‌ చేస్తాయి.? అనేదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ సంక్షోభం పదింతలయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఒక్క నగరాన్ని అభివృద్ధి చేసుకోలేని దుస్థితి రాష్ట్రానిది. అలాంటప్పుడు, మూడు హైకోర్టు బెంచ్‌లు.. రెండు చోట్ల అసెంబ్లీలు.. రెండు చోట్ల ముఖ్యమంత్రి కార్యాలయాలు.. ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా.?

ఎవర్ని వంచించడానికి ఈ రిపోర్ట్‌ తెరపైకొచ్చిందోగానీ.. ఇదొక రాజకీయ కుట్ర.. అనే అభిప్రాయాలు వివిధ రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజల దృష్టిలో విపక్షాల్ని దోషిగా చూపే ప్రయత్నం అధికార పార్టీ చేస్తోంది. రాయలసీమ దృష్టిలోనూ విపక్షాలు దోషిగా మారుతున్నాయి.. అధికార పార్టీ వికృత రాజకీయ క్రీడ కారణంగా. కేవలం రాజకీయ క్రీడలో భాగంగానే రాజధాని విషయమై కొత్త కొత్త రచ్చ.. అంటే అధికార వైఎస్సార్సీపీని చరిత్ర క్షమించదుగాక క్షమించదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...