Switch to English

ఎక్సక్లూసివ్: రాజన్న రాజ్యం “సాక్షి”కి రానట్టేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జగన్ ఒక్కసారి సీఎం అయితే చాలు.. తమ బతుకులు మారిపోతాయని వారంతా భావించారు. ఆయన్ను సీఎం చేయడానికి తమ వంతు కృషి చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను మించి పని చేశారు. పదేళ్లకు జగన్ కల నెరవేరింది. ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా వెళ్తున్నారు. ఇక తమకూ రాజన్నరాజ్యం వచ్చినట్టే అని వారు కూడా అనుకున్నారు. తమ బతుకుల్లో కొత్త కాంతులు ఖాయమని ఆనందపడ్డారు. కానీ వారి ఆశలు ఒక్కసారిగా నీరుకారిపోయాయి. వారి జీవితాలు బోరుమన్నాయి. ఇంతకీ వారెవరో కాదు.. సాక్షి ఉద్యోగులు.

జగన్ ముఖ్యమంత్రి అయితే తమ జీవితాల్లో పెనుమార్పులు ఖాయమని ఆశించిన అభాగ్యులు. మీ బాస్ సీఎం అయ్యారుగా.. బోనస్ ఎంత ఇచ్చారు? హైక్ ఎంత పడింది అంటూ సాక్షికి చెందిన ఓ జర్నలిస్టును కదిపేసరికి ఒక్కసారిగా గొల్లుమన్నాడు. బయట తమకు రెండు నెలల బోనస్ ఇచ్చేశారని, ఏకంగా రూ.10వేల జీతం పెంచేశారని ప్రచారం జరుగుతోందని, కానీ వాస్తవంగా అలాంటిదేమీ లేదని, తమ బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని బావురుమన్నాడు.

అసలు తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, తమకు జీతాలు పెంచి ఎన్నాళ్లయిందో జగన్ కు తెలుసో లేదో కూడా తమకు తెలియదని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. మరోవైపు సాక్షి జర్నలిస్టు ఆవేదనకు అక్షరరూపం అంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఇందులో నిజానిజాలు ఎంత తెలుసుకునే ప్రయత్నం చేయగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

ప్రస్తుతం సాక్షి ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్న విషయం వెల్లడైంది. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ లేదా మే నెలల్లో సాక్షి సిబ్బందికి ఇంక్రిమెంట్ పడుతుంది. అయితే, గత కొన్నేళ్లుగా రెండు సంవత్సరాలకు ఓసారి మాత్రమే సిబ్బంది జీతాలు పెరిగాయి. అది కూడా చాలా స్పల్ప మొత్తమే. 2017లో వారికి ఇంక్రిమెంట్ పడగా.. మళ్లీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. గతేడాది ఎంతో ఆశతో ఎదురుచూసిన సాక్షి సిబ్బందికి నిరాశే ఎదురైంది. అయితే, మళ్లీ ఏడాది.. అంటే 2019లో ఘనంగా జీతాలు పెంచుతారనే టాక్ నడిచింది.

ఈ క్రమంలో వీ6 ఛానల్ నుంచి వెలుగు పత్రిక రావడంతో పలువురు జర్నలిస్టులు అధిక వేతనాల కోసం అందులో చేరిపోయారు. మరికొందరు మాత్రం తమ హెచ్ఓడీల సూచన మేరకు భారీగా జీతం పెరుగుతుందనే భరోసాతో ఇక్కడే ఉండిపోయారు. అలాంటివారంతా ఇప్పుడు చాలా బాధపడుతున్నారని సమాచారం.  పై స్థాయిలో ఉన్న పది, పదిహేను మంది జీతాలకే కొన్ని రూ.కోట్లు వెచ్చిస్తున్నారని.. తమ వంటి చిన్నస్థాయి ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడంలేదని విలపిస్తున్నారు.

తెలుగురాని వ్యక్తికి సీఈఓ పోస్టు..

సాక్షిలో మరో విచిత్రమైన అంశం ఏమిటంటే.. ఈ సంస్థ కొత్త సీఈఓగా ఓ ఉత్తరాది వ్యక్తిని నియమించడం. ఆయనకు తెలుగు రాదు. ఏడాదికి రూ.2 కోట్ల భారీ ప్యాకేజీతో ఆయన నియామకం జరిగిందని సమాచారం. కేవలం మార్కెటింగ్ విభాగంలో మాత్రమే పట్టున్న ఆయనకు మొత్తం సంస్థ బాధ్యతలు అప్పగించడం.. జర్నలిజం గురించి ఏమాత్రం తెలియన సదరు సీఈఓ.. అన్నీ తానై వ్యవహరించడానికి ప్రయత్నించడం వంటి పరిణామాలు సంస్థలోని చాలామందికి నచ్చడంలేదని తెలుస్తోంది. పైగా ఆయనకు సహాయకులుగా ఉన్న మరో ఇద్దరికి నెలకు రూ.2 లక్షల వేతనం అని తెలిసింది. వీరిద్దరూ కాకుండా ఆయనకు సంస్థలో జరిగే సంగతులు చెప్పడానికి, ఇతరత్రా పనులు చేయడానికి మరో ఇద్దరు సిబ్బంది పనిచేస్తుంటారు.

ఇక సాక్షి డైరెక్టర్లు ఒక్కొక్కరికీ రూ.లక్షల్లోనే వేతనాలున్నాయి. వీరు కాకుండా వివిధ విభాగాల హెచ్ఓడీలు, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు వంటి పై స్థాయిలో ఉండే వ్యక్తుల వేతనాలు సైతం భారీగానే ఉంటాయి. ఎటొచ్చీ కింది స్థాయి సిబ్బంది పరిస్థితే దారుణంగా ఉందని తెలుస్తోంది.

సర్క్యులేషన్ పరంగా ఈనాడు మొదటి స్థానంలో ఉండగా.. సాక్షి రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతే ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వంటి పత్రికలున్నాయి. ఈనాడులో జూనియర్ జర్నలిస్టు వేతనం రూ.25 వేలు కాగా, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణల్లో దాదాపు రూ.23 వేలు ఉంది. అదే సాక్షి విషయానికి వచ్చేసరికి అది రూ.15 వేలు మాత్రమే. సాక్షి ప్రారంభం నుంచి ఉన్న సిబ్బంది వేతనాలు సైతం రూ.20 వేల లోపే ఉన్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ పాటికే సాక్షి సిబ్బందికి ఇంక్రిమెంట్లు పడాల్సి ఉండగా.. సీఈఓతోపాటు ఒక డైరెక్టర్ ఆపినట్టు సమాచారం. ఈసారికి 6.5 శాతం హైక్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సంస్థ వేతన బడ్జెట్లో అధిక మొత్తం వీరికే సరిపోతున్నందున కింది స్థాయి సిబ్బందిని తగ్గించడం, వారి వేతనాలు పెంచకుండా కుదించడం వంటి చర్యలతో సంస్థకు మిగులు చూపాలని వారు భావిస్తున్నారని అంటున్నారు. ఈ

విషయాలన్నీ అటు సీఎం జగన్ కు, ఇటు చైర్ పర్సన్ కు తెలియనీయకుండా మంత్రాంగం నడుస్తోందనే అనుమానం సాక్షి ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తమ ఆవేదన సీఎం జగన్ కు చేరితే, ఆయన తమ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అప్పుడే తమకూ రాజన్నరాజ్యం వస్తుందని నమ్ముతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...