Switch to English

పవన్‌ కళ్యాణ్‌ ‘యెల్లో మీడియా’తో అప్రమత్తంగా వుండాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, కృష్ణా జిల్లాలో పర్యటించి, రైతుల సమస్యల విషయమై కలెక్టర్‌కి వినతి పత్రం అందించిన విషయం విదితమే. ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్‌, అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రత్యేకించి పేరు చెప్పకుండా, ఆయా నేతల్ని పవన్‌ కళ్యాణ్‌ ‘కెలికిన’ వైనానికి, సదరు నేతలు ఎంతలా గింజుకుంటున్నారో చూస్తూనే వున్నాం.

మంత్రులు, ఇతర ముఖ్య నేతలు, మీడియా ముందుకొచ్చి, పవన్‌ కళ్యాణ్‌పై షరామామూలుగానే నోరు పారేసుకుంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఏ విషయాల మీద ప్రభుత్వాన్ని నిలదీశారన్నది వాళ్ళెవరికీ అనవసరం. ఎందుకంటే, ఆయా విషయాలపై మాట్లాడేంత సీన్‌ వైసీపీ నేతలెవరికీ లేదు మరి.! సరే, రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే.

కానీ, మీడియాకి ఏమయ్యింది.? టీడీపీ అను’కుల’ మీడియా పోషిస్తోన్న పాత్ర ఏంటి.? ఇంకేముంటుంది.? పవన్‌ – వైసీపీ నేతలు భలే తిట్టుకుంటున్నారే.. అంటూ పండగ చేసుకుంటోంది పచ్చ మీడియా. అటు వైసీపీ నేతల్ని ఎగదోస్తోంది.. ఇటు జనసేన నేతల్నీ ఎగదోస్తోంది. జనసేనలో పవన్‌ కళ్యాణ్‌ తప్ప, అంత గట్టిగా మాట్లాడేవారెవరూ వుండరనుకోండి.. అది వేరే సంగతి.

మంత్రుల దగ్గరకీ, వైసీపీ నేతల దగ్గరకీ వెళుతున్న టీడీపీ అను’కుల’ మీడియా, పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతల్ని రెచ్చగొట్టి మరీ, పవన్‌ని తిట్టించేస్తుండడం గమనార్హం. ఇప్పటికే పలు మార్లు ఈ ఎల్లో మీడియా ‘రంగు’ని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బట్టబయలు చేసినా.. బుద్ధి మారడంలేదు.. మారుతుందన్న ఆశ కూడా ఎవరికీ లేదనుకోండి.. అది వేరే సంగతి. అ

సలు పవన్‌ కళ్యాణ్‌ ఏ విషయమ్మీద అధికార పార్టీని నిలదీశారు.? అన్న విషయాన్ని పెద్దగా ఫోకస్‌ చేయలేదు టీడీపీ అను’కుల’ మీడియా. రైతు సమస్యలపై పవన్‌ ఎందుకు నినదించాల్సి వచ్చింది.? అన్న విషయమై చర్చలు పెట్టి వుంటే.. పరిస్థితి ఇంకోలా వుండేది. అది ప్రజలకు ఉపయోగపడేది. పవన్‌, అంశాల వారీగానే విమర్శించారు. దానికి వైసీపీ నేతలు నోరు పారేసుకున్నారు. అలా నోరు పారేసుకోవడంలో ఎవరికి వారే మాస్టర్‌ డిగ్రీ సంపాదించేసి వుంటారు..

ఈ విషయంలో ఎవరూ ఎక్కువా కాదు, ఎవరూ తక్కువా కాదు. విజ్ఞత అనేది మాత్రమే సెన్సార్‌ పాటించేలా చేస్తుంది. ఈ తిట్ల రాజకీయానికి ఆజ్యం పోసిందే టీడీపీ అను’కుల’ మీడియా. ఆ పైత్యం ఇప్పుడు ముదిరి పాకాన పడిన దరిమిలా, జనసేన అధినేత ఆ ట్రాప్‌లో పడకుండా ఒకింత జాగ్రత్త పడటం మంచిది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

రాజకీయం

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఎక్కువ చదివినవి

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ భయపడింది ఇందుకే.!

గడప గడపకీ వెళ్ళాం.. కానీ, ప్రజల్లో ఇంత వ్యతిరేకత కనిపించలేదు.. అంటూ వైసీపీ నేతలు, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారట.. తాజా ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో.! ‘పోస్టుమార్టమ్’ చేయడం...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

డిప్యూటీ సీఎం గారి తాలూకా.. అభిమానుల కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్

కొన్నాళ్ల క్రితం వచ్చిన కమ్ బ్యాక్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ఓ డైలాగ్ చెప్తారు. ' నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తాను' అని.....

ఈవీఎం హ్యాకింగ్‌ కాదు, వైసీపీ ‘మైండ్ ట్యాంపరింగ్’.!

‘మేం వైసీపీకే ఓట్లేశాం.. మా ఓట్లు ఏమైపోయాయ్.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా, వైసీపీ వికృత ప్రచారానికి తెరలేపింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తుల ఫొటోలు పెడుతూ, ఏపీ ఓటర్లుగా...