Switch to English

జీఎస్టీ రగడ: ప్రధాని మోడీకి కేసీఆర్‌ లేఖాస్త్రం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జీఎస్టీ.. ఇది అర్థం కానంత జడపదార్థమేమీ కాదు. ఒకటే దేశం.. ఒకటే పన్ను విధానం.. అంటూ ‘జీఎస్టీ’ని తెరపైకి తెచ్చింది కేంద్రం. రాష్ట్రాల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చినా, కేంద్రం దూకుడుగా వ్యవహరించింది. ఈ క్రమంలో మొదట ఆక్షేపించిన రాష్ట్రాలే.. ఆ తర్వాత బేషరతుగా కేంద్రానికి మద్దతిచ్చాయి. కాంగ్రెస్‌ హయాంలో తెరపైకి వచ్చిన జీఎస్టీ, ఎన్డీయే హయాంలో అమల్లోకి వచ్చిన విషయం విదితమే.

ఇప్పుడీ జీఎస్టీ రాష్ట్రాల్ని ఇరకాటంలో పడేసింది. రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలు కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌ నుంచి నిలిచిపోయాయి. బకాయిల చెల్లింపు విషయమై రాష్ట్రాలు ఎంతలా మొరపెట్టుకుంటున్నా కేంద్రం పట్టించుకోవడంలేదు. పైగా, ‘రెండు ఆప్షన్స్‌..’ అంటూ రాష్ట్రాల్ని మభ్యపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు.

‘కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు సాయం చేయాల్సింది పోయి.. కోత విధిస్తారా.?’ అంటూ లేఖలో నిలదీశారు కేసీఆర్‌. జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సింది పోయి, రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని కేంద్రం అనడం బాధ్యతారాహిత్యమన్నది కేసీఆర్‌ వాదన. జీఎస్టీకి తొలుత మద్దతు పలికిన రాష్ట్రం తెలంగాణ.. అంటూ కేసీఆర్‌, తన లేఖలో ప్రస్తావించారు. ‘రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాలు ఇబ్బందుల్లో వున్నప్పుడు కేంద్రం ఇతోదికంగా సాయం చేయాలి. సాయం చేయడం సంగతి తర్వాత, రాష్ట్రాలకు రావాల్సిన బకాయిల్ని చెల్లించడం అనేది కేంద్రం విధి..’ అని కేసీఆర్‌ తెగేసి చెప్పారు.

ఇంతకీ, కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ‘ఆత్మ నిర్బర భారత్‌ అభియాన్‌’ ప్యాకేజీ ఏమయినట్లు.? రాష్ట్రాలకు ఈ ప్యాకేజీతో ప్రయోజనం ఏమైనా కలిగిందా.? లేదా.? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి వుంది. నిజానికి, ఈ ప్యాకేజీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చాలా రాష్ట్రాలు, రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు కూడా అభిప్రాయ పడిన విషయం విదితమే. ఏదిఏమైనా, జీఎస్టీ అనేది అనూహ్యంగా ఇప్పుడు ‘గుదిబండ’ అయి కూర్చుంది రాష్ట్రాలకి. ఒకే దేశం.. ఒకే పన్ను విధానం.. అన్నది పేరుకేగానీ, ఆ జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తుల్ని ఇంకా తీసుకురాలేనంత అసమర్థత మన ప్రభుత్వాలది.

జీఎస్టీ రగడ: ప్రధాని మోడీకి కేసీఆర్‌ లేఖాస్త్రం.! జీఎస్టీ రగడ: ప్రధాని మోడీకి కేసీఆర్‌ లేఖాస్త్రం.! జీఎస్టీ రగడ: ప్రధాని మోడీకి కేసీఆర్‌ లేఖాస్త్రం.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....