మహానటి తర్వాత టాలీవుడ్ లో కీర్తి సురేష్ రేంజ్ పదింతలు అయ్యిందని చెప్పవచ్చు. ఈ సినిమాలోని తన నటనతో అందరినీ ముగ్దులను చేసింది కీర్తి. ఆ తర్వాత టాలీవుడ్ లో సినిమాల ఎంపిక పట్ల జాగ్రత్త వహించిన ఈ బ్యూటీ నటించిన లేటెస్ట్ సినిమా పెంగ్విన్ ఓటిటిలో విడుదలైన సంగతి తెల్సిందే. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సమర్పించిన ఈ చిత్రానికి వ్యూయర్ల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ద్వారా నిర్మాతలకు లాభమే వచ్చిందని చెప్పాలి.
ఓటిటిలో విడుదలవుతున్న సినిమాలకు అంతగా పాజిటివ్ రెస్పాన్స్ ఉండని నేపథ్యంలో నిర్మాతలు అందరూ మళ్ళీ థియేటర్ల వైపే చూసే పరిస్థితి వస్తుందనుకున్నారు. దానికి తగ్గట్లు ప్రభుత్వాలు కూడా షూటింగులు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో ఆగస్ట్ నుండి థియేటర్లు కూడా ఓపెన్ అవుతాయని భావించారు.
అయితే ప్రస్తుతం పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. షూటింగులకు అనుమతులు అయితే వచ్చాయి కానీ ఎవరూ షూటింగ్ మొదలుపెట్టడానికి సముఖంగా లేరు. పైగా థియేటర్లు ఓపెన్ అయితే జనాలు ఏ మేరకు వస్తారనేది ఇంకా తెలీదు. ఇటీవలే షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినా జనాలు పెద్దగా వస్తోంది లేదు. దీంతో మళ్ళీ ఓటిటి రిలీజ్ లే బెస్ట్ అనుకునే పరిస్థితి వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం మరో కీర్తి సురేష్ సినిమా ఓటిటి రిలీజ్ కు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే మిస్ ఇండియా. ఈ సినిమాకు ఇన్వెస్టర్లు యూఎస్ లో ఉంటారట. ప్రస్తుతం అక్కడి పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో సినిమాను త్వరగా మార్కెట్ చేసుకుని అందరికీ సెటిల్ చేద్దామనే ఆలోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే నిర్మాత మహేష్ కోనేరుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి చూడాలి ఈ సినిమా కూడా ఓటిటిలోనే విడుదలవుతుందో లేదో.
571906 708878Hmm, I never thought about it that way. I do see your point but I think many will disagree 301393
204319 879995Paris Hilton: So lovely spending time with Manny and h 539371
413568 442813Exceptional weblog here! after reading, i decide to buy a sleeping bag ASAP 492256