Switch to English

కరోనా ముంచెత్తుతున్న వేళ ‘దైవ దర్శనం’ సబబేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జూన్‌ 8 నుంచి దశల వారీగా లాక్‌డౌన్‌ని ఎత్తివేసేందుకు కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే జూన్‌ 8 నుంచి చాలా వెసులుబాట్లు రానున్నాయి. నిజానికి, లాక్‌ 3 నుంచే పెద్దయెత్తున ‘సడలింపులు’ పుట్టుకొచ్చాయి. అసలు కథ అప్పుడే మొదలయ్యింది కూడా.! మూడో లాక్‌డౌన్‌, ఆ తర్వాత నుంచే దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత మరింత పెరుగుతూ వచ్చింది. నిజానికి, ఇంకా ‘పీక్‌ స్టేజ్‌’కి చేరుకోలేదని కేంద్రమే చెబుతోంది.

ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే, ‘పీక్‌ స్టేజ్‌’ ఇంకెలా వుండబోతోంది.? ఆ సంగతి పక్కన పెడితే, జూన్‌ 8వ తేదీ నుంచి ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ‘దైవదర్శనం’ లభించనుంది. సుమారు మూడు నెలల తర్వాత దైవదర్శనమన్నమాట. ప్రధాన దేవాలయాలన్నీ ఇప్పటికే తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయి. జూన్‌ 8 నుంచి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రయోగాత్మకంగా భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. అయితే, తొలుత టీటీడీ సిబ్బంది, ఆ తర్వాత తిరుపతి నగర వాసులకీ.. ఆ తర్వాత చిత్తూరు వాసులకీ.. ఇలా క్రమక్రమంగా అందరికీ అవకాశం కల్పిస్తారన్నమాట. కానీ, ఇక్కడ ఓ ప్రశ్న సగటు భక్తుడ్ని వెంటాడుతోంది.

తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ మధ్య రాకపోకలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌ తరఫున కొన్ని ఆంక్షలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోకి వేరే రాష్ట్రం నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే, ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి.. అదీ ఆన్‌లైన్‌ విధానంలో. అలాంటప్పుడు, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడమెలా సాధ్యమవుతుంది.? ఏమో, ముందు ముందు రాష్ట్రాల మధ్య రాకపోకల విషయమై సడలింపులు వస్తాయేమో.! ఇతర రాష్ట్రాల సంగతి తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలే, తిరుపతి వెళ్ళాలంటే.. ప్రస్తుతం ఆపసోపాలు పడాల్సి వస్తుంది. రవాణా సౌకర్యం అంతంతమాత్రంగానే వుంది. పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుస్తున్నాయి.

ఇక, దర్శనం సందర్భంగా ‘సోషల్‌ డిస్టెన్సింగ్‌’ కోసం మార్కింగ్‌ అయితే చేశారుగానీ.. దాన్ని ఎంతమంది పాటిస్తారు.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే వున్నాయి. ఇది ఒక్క తిరుమలకే కాదు.. రాష్ట్రంలో, ఆ మాటకొస్తే.. దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలకీ ఇదే సమస్య ఎదురవుతుంది. దేవాలయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సహా అనేక కీలక అంశాల్ని పరిగణనలోకి తీసుకుని.. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయా.? అన్న చర్చ ఓ వైపు జోరుగా సాగుతోంటే, ‘దైవదర్శనంతో అయినా.. మానసిక ప్రశాంతత లభిస్తుంది..’ అన్న భావన చాలామంది భక్తుల్లో వ్యక్తమవుతుండడం గమనార్హం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...