Switch to English

అమరావతి పోరుకి 150 రోజులు.. ఏం సాధించినట్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి కొనసాగాలంటూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పోరాటం 150వ రోజుకి చేరుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ‘అమరావతి పోరు’కి సంబంధించిన వార్తలు ఎక్కడా కన్పించకపోయినా, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు మాత్రం ఇంకా తమ ఆందోళన కొనసాగిస్తూనే వున్నారు.. అదీ సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటిస్తూ.. లాక్‌ డౌన్‌ నిబంధనల్ని పాటిస్తూ. చాలా ప్రత్యేకమైన పోరాటమిది. రాజధాని అమరావతి కోసం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా అమరావతి ప్రాంత రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అయితే, చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని అయ్యింది గనుక, ఆ అమరావతి మీద అసహనం పుట్టుకొచ్చిందో ఏమోగానీ.. ముఖ్యమంత్రి అవుతూనే, అమరావతిపై తనదైన స్టయిల్లో రాజకీయం షురూ చేశారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.

అధికారంలోకి వస్తూనే అమరావతి ప్రాంతంలో ప్రజా వేదికను కూల్చేయడంతో మొదలయ్యింది అసలు ప్రసహనం. ప్రజా వేదిక మీద ‘అక్రమ కట్టడం’ అనే ముద్ర వేసి కూల్చేశారుగానీ, ఆ పక్కన వున్న ఏ ప్రైవేటు భవనాన్నీ ఇప్పటిదాకా కూల్చేయలేకపోయింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఇక, అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నంకి తరలించే క్రమంలో కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించారు. విశాఖపట్నంకి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అనే ముసుగు వేయాలనుకున్నారు. అమరావతిని శాసన రాజధానిగా మార్చారు. అసెంబ్లీలో బిల్లు కూడా పాస్‌ అయ్యింది. కానీ, వ్యవహారం శాసన మండలి దగ్గర ఆగిపోయింది. ప్రభుత్వ ఆలోచనల్ని వ్యతిరేకిస్తూ రైతులు ఎంత ఆందోళన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

అయితే, ప్రస్తుతం శాసన మండలి రద్దు వ్యవహారం కేంద్రం పరిధిలోకి వెళ్ళడంతో, ఆ శాసన మండలిలో ఆగిపోయిన ‘మూడు రాజధానుల వ్యవహారం’ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మరోపక్క, తమకున్న విశేష అధికారాలతో కర్నూలుకి కొన్ని కార్యాలయాల్ని తరలించాలని జగన్‌ సర్కార్‌ భావించినా.. న్యాయస్థానంలో మొట్టికాయలు తప్పలేదు. ఇక, అమరావతి కోసం రక్తం చిందించాల్సి వచ్చింది రైతులు. పోలీసులు విచక్షణా రహితంగా దాడులు చేసినా, అమరావతి రైతులు తట్టుకుని నిలబడ్డారు. ఈ క్రమంలో జరిగిన యాగీ.. హైకోర్టు ప్రభుత్వానికి వేసిన మొట్టికాయలు తెలిసిన విషయాలే. అయితే, అమరావతి పోరాటంపై ‘కుల ముద్ర’ వేయడంలో కొంత మేర వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సఫలమయ్యిందనే చెప్పాలి.

అలాగని, ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేయగలిగిందా.? అంటే అదీ లేదు. 150 రోజులు కాదు.. ఇంకెన్ని రోజులు పోరాటం చేయాల్సి వచ్చినా వెనక్కి తగ్గేది లేదని.. అమరావతి కోసం జరుగుతున్న పోరాటంలో ఇప్పటికే చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయారనీ, వారి త్యాగలు వృధా కానివ్వబోమని రైతులు నినదిస్తున్నారు. ఈ పోరాటం ఎక్కడిదాకా వెళుతుందోగానీ, అమరావతి కోసం జరుగుతున్న ఈ పోరు మాత్రం చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. సంక్షేమ పథకాల కోసం భూములు అమ్ముకుంటున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం. కానీ, రైతులు తమ రాష్ట్ర రాజధాని కోసం భూముల్ని త్యాగం చేశారు. ఇదీ చరిత్ర అంటే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...