Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: అమరావతి ఆందోళన.. ఇక అంతేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.. పది రోజులు, పాతిక రోజులు.. యాభై రోజులు కూడా దాటేశాయి. ఏమో, 100 రోజులు కూడా త్వరలోనే ఈ ఉద్యమం పూర్తి చేసేసుకుంటుందేమో. ఈలోగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా వ్యూహం రచిస్తున్న దరిమిలా.. అదేమంత ఈజీ కాదన్నది అధికార పార్టీ వర్గాలు చెబుతున్న మాట.

మరోపక్క, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ ఉద్యమానికి ‘ఊపిరి’ పోసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందన్నది నిర్వివాదాంశం. టీడీపీ మద్దతు, జనసేన సంఘీభావం, భారతీయ జనతా పార్టీ పరామర్శలు.. వామపక్షాల అండదండలు.. ఇవన్నీ పక్కన పెడితే, రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు చేస్తోన్న ఉద్యమానికి ఎవరైనా హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.

ఈ రోజుల్లో అప్పనంగా ఒక్క రూపాయి అయినా ఎవరికీ ఇవ్వడానికి ఇష్టపడరు చాలామంది. అలాంటిది, భూముల్ని ప్రభుత్వానికి అప్పగించేస్తారా.? అమరావతి రైతులు ఆ తెలివి తక్కువ పనే చేశారు. ప్రభుత్వాన్ని నమ్మడం అనేది నిజంగానే రైతులు చేసిన అతి పెద్ద తప్పిదం. ప్రభుత్వం మారగానే, రైతుల ఆశలు అడియాసలైపోవడం ఖాయమనే చర్చ గతంలోనూ జరిగింది.

‘అబ్బే, మేం అలా చేయం..’ అని చెప్పిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు రైతుల్ని నిండా ముంచేసింది. అప్పుడు పాదయాత్రలో రైతులకు హామీలు గుప్పించేసిన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక మొహం చాటేసుకుని మరీ అమరావతిలో పయనిస్తున్నారు.. అధికారిక కార్యక్రమాల కోసం. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఇలాంటి వైపరీత్యాలు సర్వ సాధారణం.

రైతులు ఏం చేయగలరు.? మహా అయితే వంద రోజుల పాటు ఆందోళన చేయగలరు.. ఇంకా గట్టిగా అంటే ఇంకో వంద రోజులు అదే పని చేయగలరు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే.? అప్పుడే పగటి పూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉద్యమకారుల్ని నిర్వీర్యం చేసేస్తున్నాయి.

దాదాపు 40 మంది అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం దిగి రావడంలేదు. ముందు ముందు ఆ మరణాలు మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు విశాఖకీ, ఇంకోపక్క కర్నూలుకీ కార్యాలయాల తరలింపు దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. అయితే, కోర్టు మొట్టికాయలేయడంతో ఆ వ్యవహారం కాస్త సస్పెన్స్‌లో పడిందనుకోండి.. అది వేరే విషయం. ‘అరిచీ అరిచీ ఆందోళనకారులు ప్రభుత్వానికి సరెండర్‌ అవుతారు’ అనే ఆలోచనతోనే జగన్‌ సర్కార్‌ వున్నట్లు తెలుస్తోంది.

అధికారం కోసం రైతుల జపం చేస్తారు.. అధికారం కోసం అడ్డమైన కట్టుకథలూ చెబుతారు.. అధికారంలోకొచ్చాక కొంప ముంచేస్తారు.. రాజకీయ నాయకుల తీరే అంత. వైఎస్‌ జగన్‌ కూడా ఓ సగటు రాజకీయ నాయకుడే కదా.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...