Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: త్రిశంకుస్వర్గంలో రాజధాని.. ఎప్పుడూ ఇంతేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

”విశాఖపట్నంను రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారు. నిజానికి ఇది ఎన్నో ఏళ్ళ కోరిక. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పటి రాజధాని హైద్రాబాద్‌ తర్వాత అంతటి పెద్ద నగరం విశాఖ మాత్రమే. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి విశాఖనే రాజధానిగా చేయాల్సి వుంది. కానీ, ఉత్తరాంధ్రకి వెన్నుపోటు పొడిచారు. ఇన్నాళ్ళకు విశాఖకు రాజధాని అయ్యే అవకాశం మళ్ళీ వచ్చింది. దీన్ని ఉత్తరాంధ్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారు..” అనే వాదన ప్రముఖంగా ఉత్తరాంధ్రలో కొందరు ప్రజా ప్రతినిథుల నుంచి వ్యక్తమవుతోంది.

మరీ ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఈ వాదన మరీ గట్టిగా విన్పిస్తోంది. నిజమే, ఉత్తరాంధ్రకి రాజధాని అయ్యేందుకు అన్ని అర్హతలూ వున్నాయి. అక్కడి ప్రజలూ విశాఖని రాజధానిగా కోరుకుంటున్నారు. ఏం, కడపను రాజధాని చేస్తామంటే అక్కడి ప్రజలు వద్దంటారా.? తిరుపతిని రాజధానిగా చేస్తామంటే అక్కడి ప్రజల వద్దంటారా.? దోనకొండ అయినా, నెల్లూరు అయినా, ఇంకో ప్రాంతమైనా.. రాజధాని గౌరవం దక్కుతుందంటే అక్కడి ప్రజలు వద్దనే అవకాశమే వుండదు. కానీ, రాజధాని పేరుతో అభివృద్ధి ఎంతవరకు సాధ్యం.? అన్నదే ఇక్కడ మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

రాజధాని అంటే రాష్ట్రానికి గుండెకాయ. ఓ నగరం రాజధానిగా మారితే అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, రాజధాని ముసుగులో చాలా అక్రమాలకూ ఆస్కారం ఏర్పడుతుంది. అమరావతి రైతులే ఇందుకు నిదర్శనం. రాజధాని ప్రకటన తర్వాత అక్కడ నానా యాగీ జరిగింది. ఆ వివాదం సద్దుమణిగిందంటే, ఇప్పుడు రాజధాని మార్పు పేరుతో అక్కడ మళ్ళీ అలజడి రేగింది. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి. ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధాని మారిపోతుందనే భావన జనంలోకి వెళ్ళిపోయింది. రేప్పొద్దున్న విశాఖకీ ఈ దుస్థితి పట్టదన్న గ్యారంటీ ఏముంది.? ఈ భయం ఇప్పుడిప్పుడే విశాఖ ప్రజల్లో పెరిగిపోతోంది.

అభివృద్ధి కోసం ప్రజల నుంచి భూముల్ని ప్రభుత్వం తీసుకోక తప్పదు. ఆ తీసుకునేటప్పుడు ప్రభుత్వం ఇచ్చే భరోసా, ప్రభుత్వాలు మారినా కొనసాగాలి. అమరావతిలో అది జరగడంలేదు. విశాఖలోనూ జరిగే అవకాశం లేదు. అప్పుడు మళ్ళీ రాజకీయ రచ్చ షురూ. రాజధానిపై ముఖ్యమంత్రి ఏం చెప్పినా, ప్రతిపక్ష నేత ఏం చెప్పినా.. అదంతా రాజకీయ అవసరాల నేపథ్యంలో చెప్పిన మాటలుగానే చూడాల్సి వస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు.

అమరావతి, విశాఖ, కర్నూలు మాత్రమే కాదు.. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని గమనించాల్సి వుంది. అమరావతి, ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అయ్యింది. ప్రభుత్వం మారగానే, ‘మా రాజధాని ఏది.?’ అని ప్రజలు ఆవేదన చెందాల్సిన దుస్థితి దాపురించింది. మళ్ళీ ప్రభుత్వం మారాక కూడా ఇలాగే ప్రశ్నించుకునే దుస్థితి రావడాన్ని రాష్ట్ర ప్రజలెవరూ కోరుకోరు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...